Political News

త‌ల‌కుమించిన భారం.. చంద్ర‌బాబు ఆప‌శోపాలు!

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆదిలోనే ఆప‌శోపాలు ప‌డుతున్నారు. కూట‌మి పొత్తులో భాగంగా చంద్ర‌బాబు బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. అయితే.. ఇవేంట‌నేది బీజేపీ తేల్చి చెప్ప‌లే దు. దీంతో ఆయ‌న మూడు ద‌ఫాలుగా 139 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. అయితే.. ఆయా స్థానాల లిస్టును కూడా బీజేపీకి ఇచ్చారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌కు కూడా 21 స్థానాలు ఇచ్చారు. ఈ పార్టీకి కూడా.. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను పంపించారు.

ఇంత వ‌ర‌కు క్లారిటీ ప‌క్కాగా ఉంది. అంటే.. టీడీపీ ప్ర‌క‌టించిన స్థానాలు కాకుండా. ఇత‌ర స్థానాల్లో బీజేపీ అయినా.. జ‌న‌సేన అయినా.. పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్క‌డే పెత్త స‌మ‌స్య చంద్ర‌బాబుకు వెంటాడుతోంది. తాము పోటీ చేస్తామ‌ని చెప్పి.. ఏకంగా.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా బీజేపీ టీడీపీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల స్థానాల‌ను లాగేసుకుంది. ఇది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిపోయింది. ఇప్ప‌టికే ఆయా స్థానాల్లో టీడీపీ  అభ్య‌ర్థులు ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు.

కానీ, తాజాగా ప్ర‌క‌టించిన బీజేపీ జాబితాలో నాలుగు సీట్లు..ఆల్రెడీ టీడీపీ ప్ర‌క‌టించినవే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ చిక్కు చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంది. దీని నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాలేక‌.. అభ్య‌ర్థుల ను స‌ముదాయించ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ముఖ్యంగా అన‌ప‌ర్తి స్థానం విష‌యం మ‌రింత క‌ఠినంగా మారింది. చంద్ర‌బాబు కోసం .. కేసులు పెట్టించుకుని.. జైలుకు కూడా వెళ్లి వ‌చ్చిన‌.. మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌మిల్లి రామ‌కృష్నారెడ్డి తాజాగా తీవ్రంగాహ‌ర్ట్ అయ్యారు.

అనపర్తి అసెంబ్లీ స్థానం టీడీపీ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. బీజేపీ లాగేసుకుంది.  దీంతో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల ను ద‌హ‌నం చేశారు. తనకు టికెట్ ఇచ్చి.. బీజేపీ తీసుకునేలా చేశార‌ని.. అదేదో ముందే చెప్పి ఉంటే.. త‌ను త‌న దారి చూసుకునేవాడిన‌ని ఆయ‌న ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతున్నారు.  

ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు న‌ల్ల‌మిల్లికి ఫోన్ చేశారు.  బీజేపీ త‌ర‌ఫున ఏర్ప‌డిన  పరిస్థితులను చంద్రబాబువివరించే ప్రయత్నం చేశారు. కానీ న‌ల్ల‌మిల్లి మాత్రం నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించారు.

“పార్టీ కోసం ప్రాణాలొడ్డి మరీ పోరాడిన నన్ను ఇవాళ బలి చేశారు. మీకోసం తెగించి పోరాడిన కొద్దిమందిలో నేనూ ఒకడిని. ఆనాడు వైఎస్సార్ పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం పోరాడిన తీరును, ఇక్కడి శ్రేణులు పోరాటాలను మరిచారా?” అంటూ చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు, అనపర్తిలో టీడీపీ ఉనికినే ప్రమాదంలో పడేశారని, ఇప్పుడు కాపాడుకోవాల్సింది మీరేనని చంద్రబాబుకు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది. 

This post was last modified on March 28, 2024 11:29 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

35 minutes ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

40 minutes ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

44 minutes ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

2 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

2 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

4 hours ago