Political News

త‌ల‌కుమించిన భారం.. చంద్ర‌బాబు ఆప‌శోపాలు!

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆదిలోనే ఆప‌శోపాలు ప‌డుతున్నారు. కూట‌మి పొత్తులో భాగంగా చంద్ర‌బాబు బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. అయితే.. ఇవేంట‌నేది బీజేపీ తేల్చి చెప్ప‌లే దు. దీంతో ఆయ‌న మూడు ద‌ఫాలుగా 139 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. అయితే.. ఆయా స్థానాల లిస్టును కూడా బీజేపీకి ఇచ్చారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌కు కూడా 21 స్థానాలు ఇచ్చారు. ఈ పార్టీకి కూడా.. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను పంపించారు.

ఇంత వ‌ర‌కు క్లారిటీ ప‌క్కాగా ఉంది. అంటే.. టీడీపీ ప్ర‌క‌టించిన స్థానాలు కాకుండా. ఇత‌ర స్థానాల్లో బీజేపీ అయినా.. జ‌న‌సేన అయినా.. పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్క‌డే పెత్త స‌మ‌స్య చంద్ర‌బాబుకు వెంటాడుతోంది. తాము పోటీ చేస్తామ‌ని చెప్పి.. ఏకంగా.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా బీజేపీ టీడీపీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల స్థానాల‌ను లాగేసుకుంది. ఇది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిపోయింది. ఇప్ప‌టికే ఆయా స్థానాల్లో టీడీపీ  అభ్య‌ర్థులు ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు.

కానీ, తాజాగా ప్ర‌క‌టించిన బీజేపీ జాబితాలో నాలుగు సీట్లు..ఆల్రెడీ టీడీపీ ప్ర‌క‌టించినవే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ చిక్కు చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంది. దీని నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాలేక‌.. అభ్య‌ర్థుల ను స‌ముదాయించ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ముఖ్యంగా అన‌ప‌ర్తి స్థానం విష‌యం మ‌రింత క‌ఠినంగా మారింది. చంద్ర‌బాబు కోసం .. కేసులు పెట్టించుకుని.. జైలుకు కూడా వెళ్లి వ‌చ్చిన‌.. మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌మిల్లి రామ‌కృష్నారెడ్డి తాజాగా తీవ్రంగాహ‌ర్ట్ అయ్యారు.

అనపర్తి అసెంబ్లీ స్థానం టీడీపీ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. బీజేపీ లాగేసుకుంది.  దీంతో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల ను ద‌హ‌నం చేశారు. తనకు టికెట్ ఇచ్చి.. బీజేపీ తీసుకునేలా చేశార‌ని.. అదేదో ముందే చెప్పి ఉంటే.. త‌ను త‌న దారి చూసుకునేవాడిన‌ని ఆయ‌న ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతున్నారు.  

ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు న‌ల్ల‌మిల్లికి ఫోన్ చేశారు.  బీజేపీ త‌ర‌ఫున ఏర్ప‌డిన  పరిస్థితులను చంద్రబాబువివరించే ప్రయత్నం చేశారు. కానీ న‌ల్ల‌మిల్లి మాత్రం నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించారు.

“పార్టీ కోసం ప్రాణాలొడ్డి మరీ పోరాడిన నన్ను ఇవాళ బలి చేశారు. మీకోసం తెగించి పోరాడిన కొద్దిమందిలో నేనూ ఒకడిని. ఆనాడు వైఎస్సార్ పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం పోరాడిన తీరును, ఇక్కడి శ్రేణులు పోరాటాలను మరిచారా?” అంటూ చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు, అనపర్తిలో టీడీపీ ఉనికినే ప్రమాదంలో పడేశారని, ఇప్పుడు కాపాడుకోవాల్సింది మీరేనని చంద్రబాబుకు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది. 

This post was last modified on March 28, 2024 11:29 pm

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

2 hours ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

4 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

4 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

5 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

5 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

6 hours ago