Political News

త‌ల‌కుమించిన భారం.. చంద్ర‌బాబు ఆప‌శోపాలు!

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆదిలోనే ఆప‌శోపాలు ప‌డుతున్నారు. కూట‌మి పొత్తులో భాగంగా చంద్ర‌బాబు బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. అయితే.. ఇవేంట‌నేది బీజేపీ తేల్చి చెప్ప‌లే దు. దీంతో ఆయ‌న మూడు ద‌ఫాలుగా 139 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. అయితే.. ఆయా స్థానాల లిస్టును కూడా బీజేపీకి ఇచ్చారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌కు కూడా 21 స్థానాలు ఇచ్చారు. ఈ పార్టీకి కూడా.. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను పంపించారు.

ఇంత వ‌ర‌కు క్లారిటీ ప‌క్కాగా ఉంది. అంటే.. టీడీపీ ప్ర‌క‌టించిన స్థానాలు కాకుండా. ఇత‌ర స్థానాల్లో బీజేపీ అయినా.. జ‌న‌సేన అయినా.. పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్క‌డే పెత్త స‌మ‌స్య చంద్ర‌బాబుకు వెంటాడుతోంది. తాము పోటీ చేస్తామ‌ని చెప్పి.. ఏకంగా.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా బీజేపీ టీడీపీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల స్థానాల‌ను లాగేసుకుంది. ఇది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిపోయింది. ఇప్ప‌టికే ఆయా స్థానాల్లో టీడీపీ  అభ్య‌ర్థులు ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు.

కానీ, తాజాగా ప్ర‌క‌టించిన బీజేపీ జాబితాలో నాలుగు సీట్లు..ఆల్రెడీ టీడీపీ ప్ర‌క‌టించినవే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ చిక్కు చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంది. దీని నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాలేక‌.. అభ్య‌ర్థుల ను స‌ముదాయించ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ముఖ్యంగా అన‌ప‌ర్తి స్థానం విష‌యం మ‌రింత క‌ఠినంగా మారింది. చంద్ర‌బాబు కోసం .. కేసులు పెట్టించుకుని.. జైలుకు కూడా వెళ్లి వ‌చ్చిన‌.. మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌మిల్లి రామ‌కృష్నారెడ్డి తాజాగా తీవ్రంగాహ‌ర్ట్ అయ్యారు.

అనపర్తి అసెంబ్లీ స్థానం టీడీపీ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. బీజేపీ లాగేసుకుంది.  దీంతో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల ను ద‌హ‌నం చేశారు. తనకు టికెట్ ఇచ్చి.. బీజేపీ తీసుకునేలా చేశార‌ని.. అదేదో ముందే చెప్పి ఉంటే.. త‌ను త‌న దారి చూసుకునేవాడిన‌ని ఆయ‌న ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతున్నారు.  

ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు న‌ల్ల‌మిల్లికి ఫోన్ చేశారు.  బీజేపీ త‌ర‌ఫున ఏర్ప‌డిన  పరిస్థితులను చంద్రబాబువివరించే ప్రయత్నం చేశారు. కానీ న‌ల్ల‌మిల్లి మాత్రం నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించారు.

“పార్టీ కోసం ప్రాణాలొడ్డి మరీ పోరాడిన నన్ను ఇవాళ బలి చేశారు. మీకోసం తెగించి పోరాడిన కొద్దిమందిలో నేనూ ఒకడిని. ఆనాడు వైఎస్సార్ పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం పోరాడిన తీరును, ఇక్కడి శ్రేణులు పోరాటాలను మరిచారా?” అంటూ చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు, అనపర్తిలో టీడీపీ ఉనికినే ప్రమాదంలో పడేశారని, ఇప్పుడు కాపాడుకోవాల్సింది మీరేనని చంద్రబాబుకు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది. 

This post was last modified on March 28, 2024 11:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

37 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

41 minutes ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

1 hour ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

1 hour ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

1 hour ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

3 hours ago