కేసు ఒక్కటే. అయితే.. నాయకులే డిఫరెంట్. అరెస్టు చేసిన సంస్థ కూడా ఒక్కటే. కానీ, ఉంచిన చోటే డిఫరెంట్. ఇలా.. ఇద్దరూ కూడా వేర్వేరు పరిస్తితులు.. వేర్వేరు హావభావాలనే ప్రకటించారు. వారే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరొకరు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితలు. ఈ ఇద్దరూ కూడా ఒకే కేసులో అరెస్టయ్యాయి. ఇద్దరినీ అరెస్టు చేసింది ఈడీనే.
అయితే.. ఢిల్లీ సీఎం ఇంకా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అక్కడ నుంచే పాలన చేస్తున్నారు. ఇక, కవిత విషయానికి వస్తే.. ఆమె విచారణ కొనసాగి.. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ కోసం కరడు గట్టిన నేరస్తులను ఉంచే తీహార్ జైలులో ఉంటున్నారు. మరి ఇద్దరు అతి పెద్ద ప్రొఫైల్ ఉన్న నాయకులు.. పైగా ఒకే కేసులో ఉన్న నాయకులు.. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది. ఈ విషయమే తాజాగా వెలుగు చూసింది.
కేజ్రీవాల్: ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. ముభావంగా .. బాధగా ఉన్నారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు.. ఆయన అన్నం తినడం లేదని.. కేవలం రెండు రకాల బిస్కట్లు మాత్రమే ఆహారంగా తీసుకుని పాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిద్ర కూడా పోవడం లేదని.. మధ్య మధ్యలో ఉలిక్కిపడినట్టు లేస్తున్నారని తెలిపారు. ఆయనలో తెలియని ఆవేదన కనిపించిందన్నారు.
కవిత: ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. తోటి మహిళా ఖైదీలతో కలిసిపోయారు. ఆమెను ఉంచిన సెల్లో మరో ఇద్దరు శిక్ష పడిన మహిళా ఖైదీలను ఉంచారు. అయితే.. ఈ ఇద్దరితోనూ కవిత కలిసి పోయారు. అంతేకాదు.. వారితో కలిసి అన్నం తింటున్నారు. కబుర్లు చెప్పుకొంటున్నారు. టీవీ చూస్తున్నారు. పుస్తకాలు చదువుకుంటున్నారు. మార్నింగ్ వాక్ కూడా ఆ ఇద్దరు మహిళా ఖైదీలతోనే చేస్తున్నారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారనేది పోలీసుల రిపోర్టు. ఇదీ.. కేజ్రీవాల్, కవితల మధ్య తేడా.
This post was last modified on March 28, 2024 7:59 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…