Political News

కేజ్రీవాల్ అలా.. క‌విత ఇలా..  డిఫ‌రెంట్ స్ట‌యిల్‌!

కేసు ఒక్క‌టే. అయితే.. నాయ‌కులే డిఫ‌రెంట్‌. అరెస్టు చేసిన సంస్థ కూడా ఒక్క‌టే. కానీ, ఉంచిన చోటే డిఫ‌రెంట్‌. ఇలా.. ఇద్ద‌రూ కూడా వేర్వేరు ప‌రిస్తితులు.. వేర్వేరు హావ‌భావాల‌నే ప్ర‌క‌టించారు. వారే.. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో అరెస్ట‌యి.. ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌. మ‌రొక‌రు.. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రికేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌లు. ఈ ఇద్ద‌రూ కూడా ఒకే కేసులో అరెస్ట‌య్యాయి. ఇద్ద‌రినీ అరెస్టు చేసింది ఈడీనే.

అయితే.. ఢిల్లీ సీఎం ఇంకా ఈడీ క‌స్ట‌డీలోనే ఉన్నారు. అక్క‌డ నుంచే పాల‌న చేస్తున్నారు. ఇక‌, క‌విత విష‌యానికి వ‌స్తే.. ఆమె విచార‌ణ కొన‌సాగి.. ప్ర‌స్తుతం 14 రోజుల రిమాండ్ కోసం క‌ర‌డు గ‌ట్టిన నేర‌స్తులను ఉంచే తీహార్ జైలులో ఉంటున్నారు. మ‌రి ఇద్ద‌రు అతి పెద్ద ప్రొఫైల్ ఉన్న నాయ‌కులు.. పైగా ఒకే కేసులో ఉన్న నాయ‌కులు.. ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా క‌నిపిస్తుంది. ఈ విష‌య‌మే తాజాగా వెలుగు చూసింది.

కేజ్రీవాల్‌:  ఈడీ క‌స్ట‌డీలో ఉన్న కేజ్రీవాల్‌.. ముభావంగా .. బాధ‌గా ఉన్నార‌ని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు.. ఆయ‌న అన్నం తిన‌డం లేద‌ని.. కేవలం రెండు ర‌కాల బిస్క‌ట్లు మాత్ర‌మే ఆహారంగా తీసుకుని పాలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. నిద్ర కూడా పోవ‌డం లేద‌ని.. మ‌ధ్య మ‌ధ్య‌లో ఉలిక్కిప‌డిన‌ట్టు లేస్తున్నార‌ని తెలిపారు. ఆయ‌న‌లో తెలియ‌ని ఆవేద‌న క‌నిపించింద‌న్నారు.

క‌విత‌:  ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్న క‌విత‌.. తోటి మ‌హిళా ఖైదీల‌తో క‌లిసిపోయారు. ఆమెను ఉంచిన సెల్‌లో మ‌రో ఇద్ద‌రు శిక్ష ప‌డిన మ‌హిళా ఖైదీల‌ను ఉంచారు. అయితే.. ఈ ఇద్ద‌రితోనూ క‌విత క‌లిసి పోయారు. అంతేకాదు.. వారితో క‌లిసి అన్నం తింటున్నారు. క‌బుర్లు చెప్పుకొంటున్నారు. టీవీ చూస్తున్నారు. పుస్త‌కాలు చ‌దువుకుంటున్నారు. మార్నింగ్ వాక్ కూడా ఆ ఇద్ద‌రు మ‌హిళా ఖైదీల‌తోనే చేస్తున్నారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నార‌నేది పోలీసుల రిపోర్టు. ఇదీ.. కేజ్రీవాల్‌, క‌విత‌ల మ‌ధ్య తేడా. 

This post was last modified on March 28, 2024 7:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

53 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago