దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రెండవ దశ పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 దశలలో జరుగుతున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రాణసంకటంగా మారింది. ఇక, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గం కూడా ఉంది. ఆయన ఈ దఫా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక, ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను సీఈసీ తాజాగా విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రెండో దశ పోలింగ్కు నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ రెండో దశలో జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్లో పరిశీలన జరగనుంది.
రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
రెండో దశలో పోలింగ్ జరిగే
రాష్ట్రాలు-స్థానాలు
కేరళలో – 20
కర్ణాటక – 14
రాజస్థాన్ – 13
మహారాష్ట్ర – 8
ఉత్తరప్రదేశ్ – 8
మధ్యప్రదేశ్ – 7
అసోం – 5
బీహార్ – 5
ఛత్తీస్గఢ్ – 3
పశ్చిమ బెంగాల్ – 3
మణిపూర్ -1
త్రిపుర-1
జమ్మూ కాశ్మీర్-1
This post was last modified on March 28, 2024 5:01 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…