దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రెండవ దశ పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 దశలలో జరుగుతున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రాణసంకటంగా మారింది. ఇక, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గం కూడా ఉంది. ఆయన ఈ దఫా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక, ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను సీఈసీ తాజాగా విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రెండో దశ పోలింగ్కు నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ రెండో దశలో జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్లో పరిశీలన జరగనుంది.
రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
రెండో దశలో పోలింగ్ జరిగే
రాష్ట్రాలు-స్థానాలు
కేరళలో – 20
కర్ణాటక – 14
రాజస్థాన్ – 13
మహారాష్ట్ర – 8
ఉత్తరప్రదేశ్ – 8
మధ్యప్రదేశ్ – 7
అసోం – 5
బీహార్ – 5
ఛత్తీస్గఢ్ – 3
పశ్చిమ బెంగాల్ – 3
మణిపూర్ -1
త్రిపుర-1
జమ్మూ కాశ్మీర్-1
This post was last modified on March 28, 2024 5:01 pm
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…
గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…