Political News

2వ ద‌శ ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్.. రాహుల్ నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడే!

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న లోక్‌సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా  రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ద‌శ‌ల‌లో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ఇక‌, తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. ఆయ‌న ఈ ద‌ఫా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఈసీ తాజాగా విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారు. ఈ రెండో ద‌శ‌లో జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో పరిశీలన జరగనుంది.

రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

రెండో ద‌శ‌లో పోలింగ్ జ‌రిగే

రాష్ట్రాలు-స్థానాలు

కేరళలో  – 20

కర్ణాటక – 14

రాజస్థాన్ – 13

మహారాష్ట్ర – 8

ఉత్తరప్రదేశ్ – 8

మధ్యప్రదేశ్ – 7

అసోం – 5

బీహార్ – 5

ఛత్తీస్‌గఢ్ – 3

పశ్చిమ బెంగాల్ –  3

మణిపూర్ -1

త్రిపుర-1

జమ్మూ కాశ్మీర్-1 

This post was last modified on March 28, 2024 5:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago