దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రెండవ దశ పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 దశలలో జరుగుతున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రాణసంకటంగా మారింది. ఇక, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గం కూడా ఉంది. ఆయన ఈ దఫా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక, ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను సీఈసీ తాజాగా విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రెండో దశ పోలింగ్కు నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ రెండో దశలో జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్లో పరిశీలన జరగనుంది.
రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
రెండో దశలో పోలింగ్ జరిగే
రాష్ట్రాలు-స్థానాలు
కేరళలో – 20
కర్ణాటక – 14
రాజస్థాన్ – 13
మహారాష్ట్ర – 8
ఉత్తరప్రదేశ్ – 8
మధ్యప్రదేశ్ – 7
అసోం – 5
బీహార్ – 5
ఛత్తీస్గఢ్ – 3
పశ్చిమ బెంగాల్ – 3
మణిపూర్ -1
త్రిపుర-1
జమ్మూ కాశ్మీర్-1
This post was last modified on March 28, 2024 5:01 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…