Political News

ర‌ఘురామ ఒంట‌ర‌య్యారు.. ఇప్పుడు ఏం చేస్తారు?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఆ పార్టీకి ఇటీవ‌ల రిజైన్ కూడా చేసిన న‌ర‌సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు క‌నుమూరి రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయ‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని.. పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని చెప్పుకొన్నా.. తీరా టికెట్‌ల కేటాయింపు అయిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పేరు ఎక్కడా వినిపించ‌లేదు. జాబితాల్లో క‌నిపించ‌లేదు. ఆయ‌న‌కు పీక‌ల్లోతు అన్యాయం జ‌రిగింద‌నే వాద‌న న‌ర‌సాపురంలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. గెలిపిస్తామ‌నే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే.. ఈ సాహ‌సం చేసేందుకు ర‌ఘురామ ఇష్ట‌ప‌డ‌డం లేదు. తాను ఓ పార్టీని(బీజేపీ లేదా టీడీపీ కావొచ్చు) న‌మ్మాన‌ని.. ఆ పార్టీ త‌న‌ను ముంచేసింద‌ని మాత్రం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, గ‌త నాలు గున్నరేళ్లుగా ఆయన సీఎం జగన్‌పై పోరాడారు. అంతేకాదు.. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. నర్సాపురం నుంచేనని చెబుతూ వస్తున్నారు. పొత్తులు ఉంటాయని.. ఏ పార్టీకి సీటు దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు.

కానీ రాజకీయం ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు అర్థమైపోయింది. బీజేపీ నుంచి టిక్కెట్ దక్కలేదు. బీజేపీ విషయంలో ఆయనకు ఇదే మొదటి ఎక్స్ పీరియన్స్ కాదు. 2014లోనూ అంతే. తనకే టిక్కెట్ వస్తుందని అనుకుంటే.. గోకరాజు గంగరాజుకు ఆరెస్సెస్ మద్దతుతో టిక్కెట్ దక్కించుకున్నారు. అప్పుడు ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరి ఈ సారి కూడా ఆయన ఎన్నికకు దూరమవుతారా? అనేది ప్ర‌శ్న‌. ఇక‌, 2019లో టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ, ఆ పార్టీ కూడా టికెట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పిల్ల‌నిచ్చిన‌ట్టు.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు.

అయితే.. రాజ‌కీయ ఆధిప‌త్యం కోస‌మో.. నియోజ‌క‌వ‌ర్గంలో మార్పులో తెలియ‌దు కానీ.. అన‌తి కాలంలోనే ఆయ‌న యాంటీ జ‌గ‌న్ అజెండాతో ముందుకు సాగారు. సీఎం జగన్‌పై ఒంటి కాలిపై లేచారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. అలాంటి నాయ‌కుడికి టీడీపీ నుంచి కానీ బిజెపీ నుంచి కానీ  టికెట్ ద‌క్క‌లేదు. ఆ షాక్‌ నుంచి ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు. నరసాపురం పార్లమెంట్‌ టెకెట్‌ను బిజెపీ సీనియ‌ర్ నాయ‌కుడు, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించింది.

ఈ నేప‌థ్యంలో రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం ఎటువైపు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.  జగన్ ను వ్యతిరేకించే వర్గాల్లో రఘురామకు ప్రత్యేకమైన అభిమ‌నులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒంట‌రిగా పోటీ చేస్తారా?  లేక ఇత‌ర పార్టీల‌వైపు మొగ్గు చూపుతారా? అనేది ఆస‌క్తిగా మారింది. చూడాలి ఆయ‌న ఏం చేస్తారో!!

This post was last modified on March 27, 2024 4:05 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

24 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago