ఏపీలో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి మరో టికెట్ కట్ అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జనసేన.. తర్వాత బీజేపీ కోరిక మేరకు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి పడిపోయింది. వీటిలో ఇప్పటికి 18 స్థానాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకుఅ భ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ మరో సీటు కోరుతోందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.
దీనిపై కేంద్ర నాయకత్వం కూడా పవన్కు ఫోన్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆ ఒక్క సీటును కూడా జనసేన నుంచి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఫలితంగా పవన్ కు 20 స్థానాలే మిగలనున్నాయని సమాచారం. వాస్తవానికి టీడీపీ-జనసేన పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ.. . ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఇంకా వీటిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ, ఇంతలోనే మరో సీటు కోసం అభ్యర్థనలు ముందుకు వచ్చాయి.
పార్టీలో నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జనసేన వైపు వేళ్లు చూపిస్తోంది. దీంతో జనసేన నుంచే ఈ ఒక్క సీటును తీసుకునేందుకు బీజేపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలోనే ఆ పదకొండో స్థానం పై చర్చ సాగింది. కడప లేదా చిత్తూరు జిల్లాలలోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే.. టీడీపీ ఇప్పటికే దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేసింది. కేవలం 5 స్థానాలకు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇవి టీడీపీ వదులుకునే నియోజకవర్గాలు కావు. దీంతో బీజేపీ ప్రతిపాదనలను జనసేన కోర్టులోకి నెట్టేసినట్టు తెలుస్తోంది.
This post was last modified on March 27, 2024 12:11 am
తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు…
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…
గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…