Political News

జ‌న‌సేన‌కు మ‌రో టికెట్ క‌ట్‌? రీజ‌న్ ఇదే!

ఏపీలో బీజేపీ, టీడీపీల‌తో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీకి మ‌రో టికెట్ క‌ట్ అవుతోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జ‌న‌సేన‌.. త‌ర్వాత బీజేపీ కోరిక మేర‌కు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి ప‌డిపోయింది. వీటిలో ఇప్ప‌టికి 18 స్థానాల‌కు మాత్రమే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మిగిలిన 3 స్థానాల‌కుఅ భ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ మ‌రో సీటు కోరుతోంద‌ని బీజేపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

దీనిపై కేంద్ర నాయ‌క‌త్వం కూడా ప‌వ‌న్‌కు ఫోన్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఆ ఒక్క సీటును కూడా జ‌న‌సేన నుంచి తీసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఫ‌లితంగా ప‌వ‌న్ కు 20 స్థానాలే మిగ‌ల‌నున్నాయ‌ని స‌మాచారం. వాస్త‌వానికి టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌తో చేతులు క‌లిపిన బీజేపీ.. . ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఇంకా వీటిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, ఇంత‌లోనే మ‌రో సీటు కోసం అభ్య‌ర్థ‌న‌లు ముందుకు వ‌చ్చాయి.

పార్టీలో నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జ‌న‌సేన వైపు వేళ్లు చూపిస్తోంది. దీంతో జ‌న‌సేన నుంచే ఈ ఒక్క సీటును తీసుకునేందుకు బీజేపీ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలోనే ఆ పదకొండో స్థానం పై చ‌ర్చ సాగింది. కడప లేదా చిత్తూరు జిల్లాల‌లోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే.. టీడీపీ ఇప్ప‌టికే దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. కేవ‌లం 5 స్థానాల‌కు మాత్ర‌మే ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇవి టీడీపీ వ‌దులుకునే నియోజ‌క‌వ‌ర్గాలు కావు. దీంతో బీజేపీ ప్ర‌తిపాద‌న‌ల‌ను జ‌న‌సేన కోర్టులోకి నెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.  

This post was last modified on March 27, 2024 12:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago