Political News

జ‌న‌సేన‌కు మ‌రో టికెట్ క‌ట్‌? రీజ‌న్ ఇదే!

ఏపీలో బీజేపీ, టీడీపీల‌తో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీకి మ‌రో టికెట్ క‌ట్ అవుతోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జ‌న‌సేన‌.. త‌ర్వాత బీజేపీ కోరిక మేర‌కు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి ప‌డిపోయింది. వీటిలో ఇప్ప‌టికి 18 స్థానాల‌కు మాత్రమే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మిగిలిన 3 స్థానాల‌కుఅ భ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ మ‌రో సీటు కోరుతోంద‌ని బీజేపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

దీనిపై కేంద్ర నాయ‌క‌త్వం కూడా ప‌వ‌న్‌కు ఫోన్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఆ ఒక్క సీటును కూడా జ‌న‌సేన నుంచి తీసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఫ‌లితంగా ప‌వ‌న్ కు 20 స్థానాలే మిగ‌ల‌నున్నాయ‌ని స‌మాచారం. వాస్త‌వానికి టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌తో చేతులు క‌లిపిన బీజేపీ.. . ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఇంకా వీటిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, ఇంత‌లోనే మ‌రో సీటు కోసం అభ్య‌ర్థ‌న‌లు ముందుకు వ‌చ్చాయి.

పార్టీలో నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జ‌న‌సేన వైపు వేళ్లు చూపిస్తోంది. దీంతో జ‌న‌సేన నుంచే ఈ ఒక్క సీటును తీసుకునేందుకు బీజేపీ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలోనే ఆ పదకొండో స్థానం పై చ‌ర్చ సాగింది. కడప లేదా చిత్తూరు జిల్లాల‌లోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే.. టీడీపీ ఇప్ప‌టికే దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. కేవ‌లం 5 స్థానాల‌కు మాత్ర‌మే ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇవి టీడీపీ వ‌దులుకునే నియోజ‌క‌వ‌ర్గాలు కావు. దీంతో బీజేపీ ప్ర‌తిపాద‌న‌ల‌ను జ‌న‌సేన కోర్టులోకి నెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.  

This post was last modified on March 27, 2024 12:11 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago