Political News

జ‌న‌సేన‌కు మ‌రో టికెట్ క‌ట్‌? రీజ‌న్ ఇదే!

ఏపీలో బీజేపీ, టీడీపీల‌తో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీకి మ‌రో టికెట్ క‌ట్ అవుతోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జ‌న‌సేన‌.. త‌ర్వాత బీజేపీ కోరిక మేర‌కు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి ప‌డిపోయింది. వీటిలో ఇప్ప‌టికి 18 స్థానాల‌కు మాత్రమే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మిగిలిన 3 స్థానాల‌కుఅ భ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ మ‌రో సీటు కోరుతోంద‌ని బీజేపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

దీనిపై కేంద్ర నాయ‌క‌త్వం కూడా ప‌వ‌న్‌కు ఫోన్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఆ ఒక్క సీటును కూడా జ‌న‌సేన నుంచి తీసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఫ‌లితంగా ప‌వ‌న్ కు 20 స్థానాలే మిగ‌ల‌నున్నాయ‌ని స‌మాచారం. వాస్త‌వానికి టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌తో చేతులు క‌లిపిన బీజేపీ.. . ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఇంకా వీటిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, ఇంత‌లోనే మ‌రో సీటు కోసం అభ్య‌ర్థ‌న‌లు ముందుకు వ‌చ్చాయి.

పార్టీలో నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జ‌న‌సేన వైపు వేళ్లు చూపిస్తోంది. దీంతో జ‌న‌సేన నుంచే ఈ ఒక్క సీటును తీసుకునేందుకు బీజేపీ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలోనే ఆ పదకొండో స్థానం పై చ‌ర్చ సాగింది. కడప లేదా చిత్తూరు జిల్లాల‌లోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే.. టీడీపీ ఇప్ప‌టికే దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. కేవ‌లం 5 స్థానాల‌కు మాత్ర‌మే ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇవి టీడీపీ వ‌దులుకునే నియోజ‌క‌వ‌ర్గాలు కావు. దీంతో బీజేపీ ప్ర‌తిపాద‌న‌ల‌ను జ‌న‌సేన కోర్టులోకి నెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.  

This post was last modified on March 27, 2024 12:11 am

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

14 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

19 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago