పులివెందులలో ఏం జరుగుతోంది.? కడపలో ఏం జరుగుతోంది.? కుప్పం అలాగే పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి, సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో పరిస్థితుల్ని పట్టించుకోకపోతే ఎలా.? ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.!
వాస్తవానికి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ నియోజకవర్గాల్లో వైసీపీ పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, అక్కడ వైసీపీని కాదని, ఇంకో పార్టీకి ఓటేసేంత రిస్క్ అక్కడి ఓటర్లు చెయ్యరన్నది వైసీపీ బలమైన నమ్మకం.
పులివెందులలో అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేదు. కానీ, ఎక్కడో చిన్న టెన్షన్. ఎందుకంటే, వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చేసింది. వైఎస్ షర్మిల, కాంగ్రెస్లో వున్నారు. వైఎస్ విజయమ్మ, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయనుంది. ఆ ఓట్లు గనుక చీలితే, వ్యవహారం బెడిసికొట్టేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలోనే, వున్నపళంగా పులివెందుల, కడప నియోజకవర్గాలపై వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారట.
తొలుత కుటుంబంలోని సమస్యల్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారట వైఎస్ జగన్. తన తల్లి విజయమ్మని ముందు నిలబెట్టి, కుటుంబాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ ప్రయత్నాల్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే, షర్మిల విషయంలో తానేమీ చేయలేననీ, అలాగే వైఎస్ వివేకా కుటుంబం విషయంలోనూ తాను చెయ్యగలిగిందేమీ లేదని విజయమ్మ తన కుమారుడు జగన్కి తేల్చి చెప్పారట. ఎన్నికలకు ఇంకా సమయం వున్న దరిమిలా, అవసరమైతే ఇంకొన్ని మెట్లు దిగైనాగానీ.. పరిస్థితుల్ని చక్కదిద్దాలనే (రాజీ కుదుర్చుకోవాలనే) ఆలోచనతో వైఎస్ జగన్ వున్నారట.
This post was last modified on March 24, 2024 5:23 pm
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…