Political News

బీఆర్ఎస్ : అభిప్రాయాల‌కు వాల్యూ ఇచ్చారే!

ఇప్ప‌టి వ‌ర‌కు అటు అసెంబ్లీకైనా.. ఇటు పార్ల‌మెంటుకైనా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు.. అంతా త‌న ఇష్టం అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. ఈ సారి అదికూడా చివ‌రి నిముషంలో మాత్రం రూటు మార్చారు. అంద‌రి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే..ఇటీవ‌ల కాలంలో కీల‌క నాయ‌కులు జంప్ చేశారు. దీంతో రూటు మార్చుకుని.. అంద‌రికీ ఫోన్లు చేసి.. అంద‌రి అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ టికెట్ల‌ను ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి మొత్తం 17 స్థానాల్లో 16 స్థానాల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

వీటిలో మూడు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఖాయం చేసింది. ప్ర‌ధాన‌మైన‌ భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా స్థానాల‌కు అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఖ‌రారు చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్ల‌మెంటు స్థానానికి పద్మారావు గౌడ్ ను ఎంపిక చేశారు. ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పోటీ చేయ‌నున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొంది.

సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని నిర్ణ‌యించారు. మొత్తానికి ఈ మార్పు వెనుక‌.. జంపింగుల ప్ర‌భావం బాగానే ప‌డింద‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on March 24, 2024 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

20 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago