Political News

బీఆర్ఎస్ : అభిప్రాయాల‌కు వాల్యూ ఇచ్చారే!

ఇప్ప‌టి వ‌ర‌కు అటు అసెంబ్లీకైనా.. ఇటు పార్ల‌మెంటుకైనా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు.. అంతా త‌న ఇష్టం అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. ఈ సారి అదికూడా చివ‌రి నిముషంలో మాత్రం రూటు మార్చారు. అంద‌రి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే..ఇటీవ‌ల కాలంలో కీల‌క నాయ‌కులు జంప్ చేశారు. దీంతో రూటు మార్చుకుని.. అంద‌రికీ ఫోన్లు చేసి.. అంద‌రి అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ టికెట్ల‌ను ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి మొత్తం 17 స్థానాల్లో 16 స్థానాల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

వీటిలో మూడు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఖాయం చేసింది. ప్ర‌ధాన‌మైన‌ భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా స్థానాల‌కు అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఖ‌రారు చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్ల‌మెంటు స్థానానికి పద్మారావు గౌడ్ ను ఎంపిక చేశారు. ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పోటీ చేయ‌నున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొంది.

సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని నిర్ణ‌యించారు. మొత్తానికి ఈ మార్పు వెనుక‌.. జంపింగుల ప్ర‌భావం బాగానే ప‌డింద‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on March 24, 2024 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

17 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

57 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago