Political News

విశాఖ డ్ర‌గ్స్ కేసు: బీజేపీని బ‌రిలోకి లాగేసిన వైసీపీ

విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో వెలుగు చూసిన 25 వేల కిలోల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. మీరంటే మీరేన‌ని ఒక‌రిపై ఒక‌రు ఈ డ్ర‌గ్స్ వివాదాన్ని రాజ‌కీయంగా మార్చుకుని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే.. ఇంత‌లోనే వైసీపీ మ‌రో వ్యూహాత్మ‌క విమ‌ర్శ‌ల‌ను తెర‌మీదికి తెచ్చింది. ఈ డ్ర‌గ్స్ కేసులో బీజేపీని కూడా లాగేసింది. బీజేపీఏపీచీఫ్ గా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, ఆమె త‌న‌యుడికి సంబంధించిన కంపెనీలే ఉన్నాయ‌ని పేర్కొంది. దీంతో ఇది మ‌రో కోణం సంత‌రించుకుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, పార్టీ కీల‌క నేత‌ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డ్ర‌గ్స్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబుకు మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

అంతేకాదు.. పురందేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సజ్జ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పురందేశ్వరి వియ్యంకుడు కూడా అదే కంపెనీలో భాగస్వామి అని తెలిపారు. వారు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి ఆ తర్వాత విడిపోయారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు అరిచే అరుపులు వింటుంటే, ఈ వ్యవహారం వెనుక ఉన్నది వీళ్లేనేమో అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడని, దాన్ని పట్టుకువచ్చి ఈ డ్రగ్స్ వ్యవహారానికి అంటగడుడుతున్నారని మండిపడ్డారు. మ‌రి స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం ఢిల్లీలోనే మ‌కాం వేసిన‌(టికెట్ల వ్య‌వ‌హారంపై) ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి, ఆమె భ‌ర్త‌ వెంక‌టేశ్వ‌రావు ఎలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on March 23, 2024 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago