Political News

విశాఖ డ్ర‌గ్స్ కేసు: బీజేపీని బ‌రిలోకి లాగేసిన వైసీపీ

విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో వెలుగు చూసిన 25 వేల కిలోల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. మీరంటే మీరేన‌ని ఒక‌రిపై ఒక‌రు ఈ డ్ర‌గ్స్ వివాదాన్ని రాజ‌కీయంగా మార్చుకుని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే.. ఇంత‌లోనే వైసీపీ మ‌రో వ్యూహాత్మ‌క విమ‌ర్శ‌ల‌ను తెర‌మీదికి తెచ్చింది. ఈ డ్ర‌గ్స్ కేసులో బీజేపీని కూడా లాగేసింది. బీజేపీఏపీచీఫ్ గా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, ఆమె త‌న‌యుడికి సంబంధించిన కంపెనీలే ఉన్నాయ‌ని పేర్కొంది. దీంతో ఇది మ‌రో కోణం సంత‌రించుకుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, పార్టీ కీల‌క నేత‌ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డ్ర‌గ్స్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబుకు మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

అంతేకాదు.. పురందేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సజ్జ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పురందేశ్వరి వియ్యంకుడు కూడా అదే కంపెనీలో భాగస్వామి అని తెలిపారు. వారు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి ఆ తర్వాత విడిపోయారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు అరిచే అరుపులు వింటుంటే, ఈ వ్యవహారం వెనుక ఉన్నది వీళ్లేనేమో అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడని, దాన్ని పట్టుకువచ్చి ఈ డ్రగ్స్ వ్యవహారానికి అంటగడుడుతున్నారని మండిపడ్డారు. మ‌రి స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం ఢిల్లీలోనే మ‌కాం వేసిన‌(టికెట్ల వ్య‌వ‌హారంపై) ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి, ఆమె భ‌ర్త‌ వెంక‌టేశ్వ‌రావు ఎలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on March 23, 2024 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago