Political News

ఇదీ ట్విస్ట్ అంటే: జగన్‌పై పోటీకి షర్మిల ‘సై’.!

కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలా రెడ్డి పోటీకి దిగబోతున్నారన్నది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. కానీ, లేటెస్ట్ గాసిప్ ఏంటంటే, నేరుగా పులివెందులలోనే అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా తలపడబోతున్నారట.

ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో, కడప నుంచి లోక్ సభకు పోటీ చేయాల్సిందిగా షర్మిలని పార్టీ సీనియర్లు కోరారట.

పార్టీ అధినాయకత్వమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుందనీ, అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి వుండాలని ఈ సందర్భంగా తీర్మానం కూడా చేశారట. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటోన్న కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా, ‘నేనూ వున్నాను’ అంటున్నారు.

ఇక, తాజా సమావేశాల్లో రఘువీరారెడ్డి, పల్లం రాజు తదితరులు, ‘పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి’ అంటూ వైఎస్ షర్మిలారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మీడియాకి లీకులు అందాయి. దాంతో, మీడియా ఆమెను ‘వైఎస్ జగన్ మీద పోటీ చేస్తున్నారా.?’ అని ప్రశ్నించింది.

‘కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశిస్తే, నేనైనా ఇంకెవరైనా.. పోటీ చేయాల్సిందే..’ అంటూ సెలవిచ్చారు వైఎస్ షర్మిల. నేరుగా ‘నేనే పోటీ చేస్తాను..’ అని షర్మిల చెప్పకపోయినా, ఆమె మాటల్లోని ఆంతర్యం సుస్పష్టం.
అయితే, వైఎస్ వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు (వివేకా కుమార్తె లేదా వివేకా సతీమణి) కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరి కంటే, షర్మిల పోటీ చేస్తేనే బావుంటుందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది.

This post was last modified on March 22, 2024 7:16 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

1 hour ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

2 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

2 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

4 hours ago