జనసేన నాయకుడు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రతి వెధవనూ గౌరవించనక్కర్లేదు
అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది. కొన్నాళ్లుగా నాగబాబు చాలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులను విమర్శించిన వారిని, వారి విధానాలను తప్పుబట్టిన వారిని కూడా ఆయన ఏకేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉద్యమ నాయకుడి గురించేనని అంటున్నారు పరిశీలకులు.
నాగబాబు ఏమన్నారంటే.. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు
అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే.. ఇది వివాదం అవుతుందని అనుకున్నారో.. లేక మరేమో తెలియదు కానీ.. గమనిక
అంటూ దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఏం మాట్లాడినా మా గురించేనేమో అని ఆపాదించుకుంటున్నారని… ఇది ఎన్నికల సమయం కాబట్టి తన ఉద్దేశాలను చెపుతున్నానే కానీ… ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలిపారు. తాను చెప్పింది జీవిత సత్య
మని చెప్పారు.
ఎవరి గురించి?
నాగబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సమయం సందర్భం లేకుండా అయితే చేయరు. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నేనే హీరో.. మిగిలిన వాళ్లు జీరో.. అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు బుధవారం పవన్ నిర్వహించిన పిఠాపురం నేతల సమావేశంలో చర్చకు వచ్చారు. దీనిపై పవన్.. ఆయన పెద్దాయన. ఏమంటాం
అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గా నాగబాబు ఇప్పుడు ఇలా దూకుడు ప్రదర్శించారని జనసేన నాయకులు అంటున్నారు.
This post was last modified on March 21, 2024 6:30 pm
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…
సినిమాలకు సంబంధించి కొన్ని డేట్లు చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. వాటి ప్రస్తావన వచ్చినప్పుడంతా అభిమానులు పాత జ్ఞాపకాల్లో మునిగి…
గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు.…
వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి…
పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో…