జనసేన నాయకుడు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రతి వెధవనూ గౌరవించనక్కర్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది. కొన్నాళ్లుగా నాగబాబు చాలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులను విమర్శించిన వారిని, వారి విధానాలను తప్పుబట్టిన వారిని కూడా ఆయన ఏకేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉద్యమ నాయకుడి గురించేనని అంటున్నారు పరిశీలకులు.
నాగబాబు ఏమన్నారంటే.. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే.. ఇది వివాదం అవుతుందని అనుకున్నారో.. లేక మరేమో తెలియదు కానీ.. గమనిక అంటూ దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఏం మాట్లాడినా మా గురించేనేమో అని ఆపాదించుకుంటున్నారని… ఇది ఎన్నికల సమయం కాబట్టి తన ఉద్దేశాలను చెపుతున్నానే కానీ… ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలిపారు. తాను చెప్పింది జీవిత సత్యమని చెప్పారు.
ఎవరి గురించి?
నాగబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సమయం సందర్భం లేకుండా అయితే చేయరు. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నేనే హీరో.. మిగిలిన వాళ్లు జీరో.. అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు బుధవారం పవన్ నిర్వహించిన పిఠాపురం నేతల సమావేశంలో చర్చకు వచ్చారు. దీనిపై పవన్.. ఆయన పెద్దాయన. ఏమంటాం అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గా నాగబాబు ఇప్పుడు ఇలా దూకుడు ప్రదర్శించారని జనసేన నాయకులు అంటున్నారు.
This post was last modified on March 21, 2024 6:30 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…