ఏపీలో డబ్బులు లేని ఎన్నికలు తీసుకువస్తామని పేర్కొంటూ రాజకీయ పార్టీ పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరిపోయారు. తాజాగా విజయవాడలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశాలకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ చేరికపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. ప్రస్తుతం డబ్బులులేని, విలువలతో కూడిన ఎన్నికలు అవసరమని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్, వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని, దేశంలో ఆ పార్టీ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శలు గుప్పించారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయింద ని చెప్పారు.
దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమని షర్మిల నిప్పులు చెరిగారు. అంబానీ, అదానీలకు బీజేపీ నాయకులు దేశ సంపదను దోచి పెడుతున్నారని ఆమె విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలు కూడా బీజేపీ మెప్పు కోసం పని చేస్తున్నాయని పరోక్షంగా పేరు చెప్పకుండానే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏపీలో గంగవరం పోర్టును అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని, విశాఖ స్టీల్ ను కూడా వీరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులు, పార్టీలపై ఈడీలను ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.
దాడులకు భయపడి బీజేపీపై ఇష్టం లేకపోయినా చాలామంది బీజేపీలో చేరుతున్నారని షర్మిల అన్నారు. చివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా కలుషితం చేశారని విమర్శించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని… ఆ తర్వాత దాన్ని విస్మరించిందని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ సమావేశానికి, సీపీఐ, సీపీఎం నాయకులు కూడా పాల్గొన్నారు.
This post was last modified on March 21, 2024 5:22 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…