Political News

ఇండియా కూట‌మిలోకి జేడీ?

ఏపీలో డ‌బ్బులు లేని ఎన్నిక‌లు తీసుకువ‌స్తామ‌ని పేర్కొంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన జై భారత్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో చేరిపోయారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఇండియా కూట‌మి పార్టీల స‌మావేశాల‌కు ఆయ‌న కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ చేరిక‌పై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బులులేని, విలువ‌ల‌తో కూడిన ఎన్నిక‌లు అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, ఈ కార్యక్ర‌మంలో ఏపీసీసీ చీఫ్‌, వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని, దేశంలో ఆ పార్టీ ఉన్మాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయింద ని చెప్పారు.

దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమని షర్మిల నిప్పులు చెరిగారు. అంబానీ, అదానీలకు బీజేపీ నాయకులు దేశ సంప‌దను దోచి పెడుతున్నార‌ని ఆమె విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలు కూడా బీజేపీ మెప్పు కోసం పని చేస్తున్నాయని ప‌రోక్షంగా పేరు చెప్ప‌కుండానే జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. ఏపీలో గంగవరం పోర్టును అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని, విశాఖ స్టీల్ ను కూడా వీరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే నాయ‌కులు, పార్టీల‌పై ఈడీల‌ను ప్ర‌యోగిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

దాడులకు భయపడి బీజేపీపై ఇష్టం లేకపోయినా చాలామంది బీజేపీలో చేరుతున్నారని షర్మిల అన్నారు. చివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా కలుషితం చేశారని విమర్శించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని… ఆ తర్వాత దాన్ని విస్మరించిందని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ స‌మావేశానికి, సీపీఐ, సీపీఎం నాయ‌కులు కూడా పాల్గొన్నారు.

This post was last modified on March 21, 2024 5:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: JD

Recent Posts

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

56 minutes ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

2 hours ago

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు…

2 hours ago

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

4 hours ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

4 hours ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

4 hours ago