Political News

ఆ కాపు నేత‌ల మాటల‌కు వాల్యూ ఉంటుందా..!

ఔను.. మాట చాలా ముఖ్యం. ముఖ్యంగా రాజ‌కీయాల్లో నాయ‌కులు ఇచ్చే వాగ్దానాల‌కు, చెప్పే మాట‌ల‌కు కూడా వాల్యూ ఉండాలి. ఎందుకంటే.. ఎన్నికల్లో నాయ‌కులు చెప్పే మాట‌ల‌ను బ‌ట్టి.. వారిపై ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌ను బ‌ట్టి.. ప్ర‌జలు వారివైపు మొగ్గు చూపుతారు. పోలింగ్ బూతుల్లో ఓట్లు వేస్తారు. అందుకే రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త‌కు కీల‌క‌మైన పాత్ర ఉంది. ఇక‌, తాజాగా రాష్ట్రంలో కాపుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వ‌ర్గాల తీరు ఒక ఎత్త‌యితే.. కాపులు ఒక్క‌రూ ఒక ఎత్తుగా ఉన్నారు.

24 శాతం ఓటు బ్యాంకుగా ఉన్నార‌ని భావిస్తున్న కాపుల‌ను ఆక‌ట్టుకునేందుకు అన్ని పార్టీలూ ప్ర‌య‌త్నా లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కాపుల్లో బ‌ల‌మైన వాయిస్ వినిపించి, వారి ప‌క్షాన పోరాటాలు కూడా చేసిన ఇద్ద‌రుకీల‌క నాయ‌కుల‌ను వైసీపీ త‌న చెంతకు చేర్చుకుంది. త‌ద్వారా.. కాపుల్లో జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊపును త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేయాల‌న్నది సీఎం జ‌గ‌న్ వ్యూహం. దీంతో కాపుల్లో ఐకాన్‌గా ఉన్న ఇద్ద‌రిని పార్టీలోచేర్చుకుని, కండువా క‌ప్పేశారు.

వవీరే. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య కుమారుడు.. చేగొండి సూర్య‌ప్ర‌కాశ్‌లు. వీరిద్ద‌రూ ఇటీవ‌లే వైసీపీలో చేరారు. వీరిద్వారా ఎన్నిక‌ల్లో కాపుల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌న్న‌ది వైసీపీ వ్యూహం. అయితే.. వీరికి ఒక‌ప్పుడు ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌.. ఇప్పుడు లేద‌నేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. కాపుల ఉద్య‌మంతో పేరు తెచ్చుకున్న ముద్ర‌గ‌డ‌.. త‌ట‌స్థంగా ఉంటూ.. పార్టీల‌ను విమ‌ర్శించారు. కాపుల‌కు ఏమీ చేయ‌లేదన్నారు. దీంతో ఆయ‌న వెంట కాపులు ఉన్నారు. న‌మ్మారు కూడా.

ఇక‌, చేగొండి సూర్య ప్ర‌కాశ్‌.. ఒక‌ప్పుడు వైసీపీని తీవ్ర‌స్థాయిలో దూషించారు. అదేస‌మ‌యంలో కాపుల‌కు ఏమీ చేయ‌లేద‌ని కూడా వైసీపీపై విరుచుకుప‌డ్డారు. కానీ, ఇప్పుడు ఇద్ద‌రూ కూడా కండువాలు క‌ప్పుకొని వైసీపీ నాయ‌కులు అయిపోయారు. ఈ నేప‌థ్యంలో వారి మాట‌కు విశ్వ‌స‌నీయ‌త ఎంత‌? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఐదేళ్ల కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. కాపుల‌కు వీరు చేసింది ఏమీలేదు.

ఏమీ చేయించుకున్న‌ది కూడా ఏమీలేదు. క‌నీసం ప్ర‌శ్నించ‌లేదు. ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున పార్టీ ప్ర‌చారానికి సిద్ధ‌ప‌డుతుండ‌డంతో కాపుల్లో వీరి విశ్వ‌స‌నీయ‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీరికి త‌మ సొంత ఇమేజ్‌తోపాటు.. పార్టీ ప‌రంగాకూడా ప్ర‌జ‌లు న‌మ్మ‌బోర‌ని చెబుతున్నారు. 

This post was last modified on March 21, 2024 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

3 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

3 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

4 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

8 hours ago