Political News

సీనియ‌ర్ల‌ను పక్కన పెడుతున్న బీజేపీ

ఏపీ బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఏపీలో బీజేపీ కురువృద్ధుల‌కు వీర‌తాళ్లు వేయాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌ను ముందుపెట్టి విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. టీడీపీ ఎన్డీఏలో చేర‌డంతో ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో బీజేపీకి దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి.ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బీజేపీ నాయ‌కులు పాత‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు కల్పిస్తున్నార‌ని, అందుకే పార్టీ ఎద‌గ‌డం లేద‌ని కూడా భావించింది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై సీనియర్లను అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అంతే కాదు ఓడిపోయే సీట్లు కాకుండా.. టీడీపీ నుంచి గెలిచే సీట్ల‌ను మాత్ర‌మే తీసుకోవాల‌ని తాజాగా నిర్ణ‌యానికి వ‌చ్చినట్టు స‌మాచారం. దీంతో ఆ 10 సీట్లు హాట్ కేక్‌లే కావాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పెద్ద‌జాబితాను కేంద్ర బీజేపీ నేత‌ల‌కు స‌మ‌ర్పించారు. దీనిలో సీనియ‌ర్లు చాలా మంది ఉన్నార‌ని తెలిసింది.

వీరికి అవ‌కాశం?

బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత జూపూడి రంగరాజు, జాతీయ మహిళా విభాగం నాయకురాలు మాలతీరాణి ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించ‌నున్న ట్టు బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు సోము వీర్రాజుకు కూడా అవ‌కాశం ద‌క్క‌నుంది. అయితే.. రెండు నుంచి మూడు సీట్ల‌ను జూనియ‌ర్ల‌కు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.

నిజానికి గత ఐదేళ్లుగా బీజేపీలో కీలక పదవుల్లో ఉండి.. ప్రజల్లో పని చేసి.. పార్టీ ఇచ్చిన ప నుల్ని సమర్థంగా నిర్వహించిన యువనేతలు, సీనియర్ నేతలకు ఖచ్చితంగా అవకాశం రావాల్సి ఉంది. కానీ సీనియర్లపై రాజకీయ పరమైన ప్రచారాలు చేసి.. వారికి సీటు రాకుండా చేయడానికి కొంత మంది ప్రయత్నించడం .. వారి మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి ఏర్పడటంతో సీనియర్లు నిరాశపడ్డారు. పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు కానీ.. తమ త్యాగం.. బీజేపీకి నష్టం చేస్తుందని తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యించార‌ని స‌మాచారం.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago