Political News

సీనియ‌ర్ల‌ను పక్కన పెడుతున్న బీజేపీ

ఏపీ బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఏపీలో బీజేపీ కురువృద్ధుల‌కు వీర‌తాళ్లు వేయాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌ను ముందుపెట్టి విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. టీడీపీ ఎన్డీఏలో చేర‌డంతో ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో బీజేపీకి దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి.ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బీజేపీ నాయ‌కులు పాత‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు కల్పిస్తున్నార‌ని, అందుకే పార్టీ ఎద‌గ‌డం లేద‌ని కూడా భావించింది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై సీనియర్లను అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అంతే కాదు ఓడిపోయే సీట్లు కాకుండా.. టీడీపీ నుంచి గెలిచే సీట్ల‌ను మాత్ర‌మే తీసుకోవాల‌ని తాజాగా నిర్ణ‌యానికి వ‌చ్చినట్టు స‌మాచారం. దీంతో ఆ 10 సీట్లు హాట్ కేక్‌లే కావాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పెద్ద‌జాబితాను కేంద్ర బీజేపీ నేత‌ల‌కు స‌మ‌ర్పించారు. దీనిలో సీనియ‌ర్లు చాలా మంది ఉన్నార‌ని తెలిసింది.

వీరికి అవ‌కాశం?

బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత జూపూడి రంగరాజు, జాతీయ మహిళా విభాగం నాయకురాలు మాలతీరాణి ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించ‌నున్న ట్టు బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు సోము వీర్రాజుకు కూడా అవ‌కాశం ద‌క్క‌నుంది. అయితే.. రెండు నుంచి మూడు సీట్ల‌ను జూనియ‌ర్ల‌కు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.

నిజానికి గత ఐదేళ్లుగా బీజేపీలో కీలక పదవుల్లో ఉండి.. ప్రజల్లో పని చేసి.. పార్టీ ఇచ్చిన ప నుల్ని సమర్థంగా నిర్వహించిన యువనేతలు, సీనియర్ నేతలకు ఖచ్చితంగా అవకాశం రావాల్సి ఉంది. కానీ సీనియర్లపై రాజకీయ పరమైన ప్రచారాలు చేసి.. వారికి సీటు రాకుండా చేయడానికి కొంత మంది ప్రయత్నించడం .. వారి మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి ఏర్పడటంతో సీనియర్లు నిరాశపడ్డారు. పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు కానీ.. తమ త్యాగం.. బీజేపీకి నష్టం చేస్తుందని తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యించార‌ని స‌మాచారం.

This post was last modified on March 20, 2024 10:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

12 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago