Political News

టీడీపీకా.. బీజేపీకా.. హిందూపురం టికెట్‌పై స‌స్పెన్స్‌!

పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్ప‌టికే 6 పార్ల‌మెంటు స్థానాల‌ను బీజేపీకి కేటాయించిన విష యం తెలిసిందే. అయితే.. వీటిలో ఏవేవి ఇస్తార‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన‌.. హిందూపురం పార్ల‌మెంటు స్థానం విష‌యంపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ టికెట్‌ను తొలుత బీజేపీకి కేటాయించారు. అయితే..ఇ ప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారాయ‌ని తెలుస్తోంది. మైనారిటీ వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ బీజేపీ పోటీ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌నే కామెంట్లు, అంచ‌నాలు వ‌చ్చాయి. దీంతో బీజేపీ యూట‌ర్న్ తీసుకుని ఇది కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి పొత్తుకుదిరిన తొలినాళ్ల‌లో హిందూపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ తరఫున కాకినాడ శ్రీపీఠం పీఠాధిప‌తి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ముస్లిం మైనారిటీ ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను కాద‌ని మ‌ళ్లీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో రాజ‌కీయంగా హిందూపురంపై చ‌ర్చ కూడా సాగింది. అయితే.. మారిన తాజా ప‌రిణామాలు(ఏపీబీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి ఢిల్లీకి వెళ్లాక‌) టీడీపీనే పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని తాజాగా టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

హిందూపురం నుంచి బీకే పార్థసారధిని కాకుండా అనంతపురం నుంచే అభ్యర్థిగా నిలబడతారని మ‌రో చ‌ర్చ సాగుతోంది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేపీ పవన్ రెడ్డి పేరు మ‌రోవైపు ప్రచారంలోకి వచ్చింది. అవకాశం కల్పిస్తే పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేక హిందూపురం ఎంపీ టికెట్టు కేటాయించాలని చంద్రబాబును పార్థసారధి కోరారు. ఇదే సందర్భంలో హిందూపురం లోక్ సభ సీటుపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, హిందూపురం లోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ కూడా పోటీ పడుతున్నారు. దీంతో టిడిపి అధిష్టానం హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక కోసం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని మ‌రో చ‌ర్చ సాగుతోంది.

ఇదివరకు చంద్ర‌బాబు నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వే సందర్భంగా వచ్చిన పేరుని ఖరారు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కదిరి, పెనుగొండ, పుట్టపర్తి, సింగనమల, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను సర్వే ద్వారానే ఎంపిక చేశారు. ప్రస్తుతం హిందూపురం అభ్యర్థిగా ఐ వి ఆర్ ఎస్ సర్వేలో భాగంగా దళ‌వాయి వెంకట‌ రమణ పేరు బలపరిస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అంటూ సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా బట్టి చూస్తే ఆయ‌న‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం హిందూపురం కేటాయింపుపై స‌స్పెన్స్ అయితే కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 20, 2024 10:34 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago