Political News

టీడీపీకా.. బీజేపీకా.. హిందూపురం టికెట్‌పై స‌స్పెన్స్‌!

పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్ప‌టికే 6 పార్ల‌మెంటు స్థానాల‌ను బీజేపీకి కేటాయించిన విష యం తెలిసిందే. అయితే.. వీటిలో ఏవేవి ఇస్తార‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన‌.. హిందూపురం పార్ల‌మెంటు స్థానం విష‌యంపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ టికెట్‌ను తొలుత బీజేపీకి కేటాయించారు. అయితే..ఇ ప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారాయ‌ని తెలుస్తోంది. మైనారిటీ వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ బీజేపీ పోటీ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌నే కామెంట్లు, అంచ‌నాలు వ‌చ్చాయి. దీంతో బీజేపీ యూట‌ర్న్ తీసుకుని ఇది కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి పొత్తుకుదిరిన తొలినాళ్ల‌లో హిందూపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ తరఫున కాకినాడ శ్రీపీఠం పీఠాధిప‌తి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ముస్లిం మైనారిటీ ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను కాద‌ని మ‌ళ్లీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో రాజ‌కీయంగా హిందూపురంపై చ‌ర్చ కూడా సాగింది. అయితే.. మారిన తాజా ప‌రిణామాలు(ఏపీబీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి ఢిల్లీకి వెళ్లాక‌) టీడీపీనే పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని తాజాగా టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

హిందూపురం నుంచి బీకే పార్థసారధిని కాకుండా అనంతపురం నుంచే అభ్యర్థిగా నిలబడతారని మ‌రో చ‌ర్చ సాగుతోంది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేపీ పవన్ రెడ్డి పేరు మ‌రోవైపు ప్రచారంలోకి వచ్చింది. అవకాశం కల్పిస్తే పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేక హిందూపురం ఎంపీ టికెట్టు కేటాయించాలని చంద్రబాబును పార్థసారధి కోరారు. ఇదే సందర్భంలో హిందూపురం లోక్ సభ సీటుపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, హిందూపురం లోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ కూడా పోటీ పడుతున్నారు. దీంతో టిడిపి అధిష్టానం హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక కోసం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని మ‌రో చ‌ర్చ సాగుతోంది.

ఇదివరకు చంద్ర‌బాబు నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వే సందర్భంగా వచ్చిన పేరుని ఖరారు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కదిరి, పెనుగొండ, పుట్టపర్తి, సింగనమల, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను సర్వే ద్వారానే ఎంపిక చేశారు. ప్రస్తుతం హిందూపురం అభ్యర్థిగా ఐ వి ఆర్ ఎస్ సర్వేలో భాగంగా దళ‌వాయి వెంకట‌ రమణ పేరు బలపరిస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అంటూ సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా బట్టి చూస్తే ఆయ‌న‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం హిందూపురం కేటాయింపుపై స‌స్పెన్స్ అయితే కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 20, 2024 10:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago