Political News

టీడీపీకా.. బీజేపీకా.. హిందూపురం టికెట్‌పై స‌స్పెన్స్‌!

పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్ప‌టికే 6 పార్ల‌మెంటు స్థానాల‌ను బీజేపీకి కేటాయించిన విష యం తెలిసిందే. అయితే.. వీటిలో ఏవేవి ఇస్తార‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన‌.. హిందూపురం పార్ల‌మెంటు స్థానం విష‌యంపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ టికెట్‌ను తొలుత బీజేపీకి కేటాయించారు. అయితే..ఇ ప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారాయ‌ని తెలుస్తోంది. మైనారిటీ వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ బీజేపీ పోటీ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌నే కామెంట్లు, అంచ‌నాలు వ‌చ్చాయి. దీంతో బీజేపీ యూట‌ర్న్ తీసుకుని ఇది కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి పొత్తుకుదిరిన తొలినాళ్ల‌లో హిందూపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ తరఫున కాకినాడ శ్రీపీఠం పీఠాధిప‌తి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ముస్లిం మైనారిటీ ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను కాద‌ని మ‌ళ్లీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో రాజ‌కీయంగా హిందూపురంపై చ‌ర్చ కూడా సాగింది. అయితే.. మారిన తాజా ప‌రిణామాలు(ఏపీబీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి ఢిల్లీకి వెళ్లాక‌) టీడీపీనే పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని తాజాగా టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

హిందూపురం నుంచి బీకే పార్థసారధిని కాకుండా అనంతపురం నుంచే అభ్యర్థిగా నిలబడతారని మ‌రో చ‌ర్చ సాగుతోంది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేపీ పవన్ రెడ్డి పేరు మ‌రోవైపు ప్రచారంలోకి వచ్చింది. అవకాశం కల్పిస్తే పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేక హిందూపురం ఎంపీ టికెట్టు కేటాయించాలని చంద్రబాబును పార్థసారధి కోరారు. ఇదే సందర్భంలో హిందూపురం లోక్ సభ సీటుపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, హిందూపురం లోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ కూడా పోటీ పడుతున్నారు. దీంతో టిడిపి అధిష్టానం హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక కోసం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని మ‌రో చ‌ర్చ సాగుతోంది.

ఇదివరకు చంద్ర‌బాబు నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వే సందర్భంగా వచ్చిన పేరుని ఖరారు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కదిరి, పెనుగొండ, పుట్టపర్తి, సింగనమల, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను సర్వే ద్వారానే ఎంపిక చేశారు. ప్రస్తుతం హిందూపురం అభ్యర్థిగా ఐ వి ఆర్ ఎస్ సర్వేలో భాగంగా దళ‌వాయి వెంకట‌ రమణ పేరు బలపరిస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అంటూ సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా బట్టి చూస్తే ఆయ‌న‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం హిందూపురం కేటాయింపుపై స‌స్పెన్స్ అయితే కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 20, 2024 10:34 pm

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

38 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago