తెలంగాణ టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుందా? గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. అయితే.. ఈ ప్రతిపాదన తమది కాదని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ సీట్లు పంచుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. తెలంగాణలో తమకు క్లిష్టంగా.. టీడీపీకి ఈజీగా ఉన్న సీట్లలో టీడీపీకి అవకాశం ఇచ్చి.. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలకు చెక్ పెట్టాలనేది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ 15 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మంకు మాత్రమే పెండింగ్ పెట్టారు. ఖమ్మం నంచి జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అధికారికంగా విడుదల చేసిన రెండు జాబితాలలోనూ జలగం పేరు రాలేదు. అలాగే వరంగల్ లో అభ్యర్థిగా భావించిన ఆరూరి రమేష్ చేరిక విషయంలోనూ హైడ్రామా చోటు చేసుకుంది. అందుకే ఆ సీటు ప్రకటననూ నిలిపివేశారు. ప్రస్తుతానికి ఆరూరి రమేష్ చేరినా..ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఆకస్మికంగా ఖమ్మం పార్లమెంటు సీటును టీడీపీకి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మంలో టీడీపీకి పట్టుంది. పైగా.. పొరుగునే ఉన్న ఏపీతోనూ సరిహద్దులు పంచుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక, ఇక్కడ బీజేపీకి పట్టులేదు. అలాగని వదిలేయాలని బీజేపీ నేతలు భావించడం లేదు. బలమైన కాంగ్రెస్నుదెబ్బకొట్టాలంటే.. మిత్రపక్షాన్ని ఇక్కడ దింపి..త ద్వారా విజయం దక్కించుకుని.. తర్వాత తమలో ఆ ఎంపీని కలిపేసుకునే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఖమ్మంపార్లమెంటును గమనిస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ బలంగా ఉంది. పైగా.. మంత్రి భట్టి విక్రమార్క సతీమణి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బలహీనపడింది. గత ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్కు సహకరించింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లంతా టీడీపీ నేతల్ని కలిసి మద్దతు అడిగారు. ఖమ్మం రాజకీయ సమీకరణలతో.. టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని సర్వేలు తేల్చడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంపై బీజేపీ అగ్రనేతలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…