ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సోదరుడు(చిన్నాన్న కుమారుడు) వంగవీటి నరేంద్ర తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుస పెట్టి కాపు నేతలను, ఆ వర్గాన్ని ప్రభావితం చేయగలరన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.
కొన్నిరోజుల కిందట.. చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత.. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఏకంగా వంగవీటి రాధా తమ్ముడిని పార్టీలోకి తీసుకున్నారు. వాస్తవానికి రాధా గత 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు.అ యితే, ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీలోకి వెళ్లారు. ఇక, ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారనే చర్చసాగుతోంది.
ఇలాంటి సమయంలో రాధా సోదరుడిని పార్టీలోకి తీసుకోవడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, తాను బీజేపీ నుంచి బయటికి వచ్చేశానని వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డితో చర్చించిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని నరేంద్ర పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలది నాలుగు దశాబ్దాల అనుబంధం అని చెప్పారు. వంగవీటి రంగాను అభిమానిస్తానని చెప్పుకునే పవన్ కల్యాణ్ టీడీపీతో ఎలా కలుస్తాడని నరేంద్ర ప్రశ్నించారు.
టీడీపీతో పొత్తు కుదుర్చుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తన సోదరుడు వంగవీటి రాధా గతంలో వైసీపీ నుంచి బయటికి వచ్చేసి తప్పు చేశాడని నరేంద్ర అన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని, ఈ ఐదేళ్లలో జగన్ అందించిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. కాగా, ఈయనను పిఠాపురం, కాకినాడ జిల్లాల్లో వైసీపీ ప్రచారానికి వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. కాపు నాయకులను ప్రభావితం చేసేందుకు ఈయనను వాడేయనుందనే చర్చ సాగుతోంది.
This post was last modified on March 20, 2024 10:26 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…