ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సోదరుడు(చిన్నాన్న కుమారుడు) వంగవీటి నరేంద్ర తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుస పెట్టి కాపు నేతలను, ఆ వర్గాన్ని ప్రభావితం చేయగలరన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.
కొన్నిరోజుల కిందట.. చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత.. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఏకంగా వంగవీటి రాధా తమ్ముడిని పార్టీలోకి తీసుకున్నారు. వాస్తవానికి రాధా గత 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు.అ యితే, ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీలోకి వెళ్లారు. ఇక, ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారనే చర్చసాగుతోంది.
ఇలాంటి సమయంలో రాధా సోదరుడిని పార్టీలోకి తీసుకోవడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, తాను బీజేపీ నుంచి బయటికి వచ్చేశానని వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డితో చర్చించిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని నరేంద్ర పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలది నాలుగు దశాబ్దాల అనుబంధం అని చెప్పారు. వంగవీటి రంగాను అభిమానిస్తానని చెప్పుకునే పవన్ కల్యాణ్ టీడీపీతో ఎలా కలుస్తాడని నరేంద్ర ప్రశ్నించారు.
టీడీపీతో పొత్తు కుదుర్చుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తన సోదరుడు వంగవీటి రాధా గతంలో వైసీపీ నుంచి బయటికి వచ్చేసి తప్పు చేశాడని నరేంద్ర అన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని, ఈ ఐదేళ్లలో జగన్ అందించిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. కాగా, ఈయనను పిఠాపురం, కాకినాడ జిల్లాల్లో వైసీపీ ప్రచారానికి వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. కాపు నాయకులను ప్రభావితం చేసేందుకు ఈయనను వాడేయనుందనే చర్చ సాగుతోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…