Political News

పవన్ ‘మైండ్ గేమ్’ దేనికి.?

గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇలా మూడు నియోజకవర్గాలపై సంకేతాలు ఇచ్చి, చివరికి పిఠాపురం నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పిఠాపురం విషయమై జనసేనలో క్లారిటీ వున్నా, వైసీపీ శ్రేణుల్లో కొంత అయోమయం కనిపిస్తోంది.

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వ్యూహాత్మకంగా పిఠాపురంలో మోహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, లక్ష మెజార్టీ పక్కా.. అని జనసేన శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చాలాకాలంగా పిఠాపురంలో గ్రౌండ్ వర్క్ చేశారు అంతలా.! ఆయనే పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పిఠాపురం ఎంచుకున్నారు, ఉదయ్ కాకినాడ లోక్ సభకు పోటీ చేస్తారని తేల్చేశారు.

అయితే, ఇక్కడే ఓ మ్యాజిక్ వుంది. దాన్ని మైండ్ గేమ్ అని కూడా అనొచ్చు. బీజేపీ పెద్దలు తనను లోక్ సభకు పోటీ చేయమని సూచించినట్లుగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. లోక్ సభ, అసెంబ్లీ.. రెండిట్లోనూ పోటీ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి బీజేపీ అధినాయకత్వం సూచించినట్లు గతంలో ప్రచారం జరిగింది. అది నిజమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తేటతెల్లమయ్యింది.

నామినేషన్లు వేసే సమయానికి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలాగైనా మారొచ్చనీ, వైసీపీని కన్‌ఫ్యూజన్‌లో పెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారనీ.. ఓ ప్రచారం తెరపైకొచ్చింది.

పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పంపకాలు జోరుగా సాగుతున్నాయి. అంతకు ముందు గాజువాక, భీమవరం, తిరుపతి నియోజకవర్గాల్లోనూ ఇలాగే జరిగింది. ఆ పంపకాల తాలూకు ఖర్చు కోట్లలో వుంటుందనేది ఓ అంచనా.

ఇప్పుడేమో పిఠాపురం వంతు.! వున్నపళంగా పవన్ కళ్యాణ్ ‘లోక్ సభ’కు పోటీ చేస్తానని ప్రకటిస్తే ఏంటి పరిస్థితి.? ఏముంది.. మళ్ళీ వైసీపీ మార్కు ఉరుకులాటే.!

This post was last modified on March 20, 2024 10:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

9 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago