Political News

చంద్ర‌బాబుకు ఈసీ నోటీసులు.. మ‌రి వైసీపీ మాటేంటి?

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ కోడ్ కేవ‌లం ప్రతిప‌క్ష పార్టీల‌కు మాత్ర‌మే కాదు. అధికార పార్టీకి కూడా సంపూర్ణంగా వ‌ర్తిస్తుంది. కానీ, చిత్రంగా ప్ర‌తిప‌క్షంపైనే చర్య‌లు తీసుకోవడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎందుకంటే..టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఎన్నిక‌ల సంఘం నోటీసులు జారీ చేసింది. అది కూడా సీఎం జ‌గ‌న్‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో టీడీపీ సోష‌ల్ మీడియాలో ఎవ‌రో చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును ఆదేశించింది. ఈ మేర‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నిక‌ల సంఘం ఆగ‌మేఘాల‌పై నిర్ణ‌యం తీసుకుంది.

టీడీపీకి చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ల ద్వారా జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం వెంట‌నే రియాక్ట్ అయింది. చంద్ర‌బాబు నుంచి వివ‌ర‌ణ కోరుతూ ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చింది. అంతేకాదు.. ఆయా సోష‌ల్ మీడియాల్లోని పోస్టుల‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఆదేశించింది. క‌ట్ చేస్తే.. ఇదే వైసీపీపై టీడీపీ కూడా ఇప్ప‌టికి ప‌ది ఫిర్యాదులు చేసింది. అయితే.. ఒక్క ఫిర్యాదుపైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ స్పందించ‌లేదు. ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చార చిత్రాలు టిలి కాస్ట్ చేస్తున్నార‌ని టీడీపీ ఫిర్యాదు చేసింది.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన‌ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను వైసీపీ త‌న ప్ర‌చారానికి వినియోగించుకుంటోంద‌ని కూడా టీడీపీ లికిత పూర్వ‌కంగా వివ‌రించింది. వారికి ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌న్నుల నుంచి వేత‌నాలు ఇస్తున్నార‌ని.. వారిని రాజ‌కీయంగా వినియోగించుకోవ‌డానికి వీల్లేద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే ఆదేశాలు ఇచ్చింద‌ని, అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నాయ‌కులు వ‌లంటీర్ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాల‌కు వినియోగిస్తున్నార‌ని.. ఇది కోడ్ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని టీడీపీ అనేక ఫిర్యాదులు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఈసీ నుంచి ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది.

పోనీ.. వీటికి సంబంధించిన ఆధారాలు లేవా? అంటే..ఉన్నాయి. అయినా కూడా.. ఈసీ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై ప్ర‌జాసంఘాల నుంచి పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. లాలూచీ ప‌డింద‌ని ఎవ‌రూ అనక‌పోయినా.. చ‌ర్య‌లు తీసుకోకపోవ‌డం వెనుక‌.. ఈసీపైనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని ఆయా సంఘాల నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on March 19, 2024 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

12 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago