ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ సర్కారు అతి పెద్ద ఫెయిల్యూర్లలో పోలవరం ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 70 శాతానికి పైగా పూర్తయిన ఆ మెగా ప్రాజెక్టును ఇంకో ఏడాదిలో పూర్తి చేస్తాం అంటూ.. ఒక్కో సంవత్సరం గడుపుతూ వచ్చారు. కానీ చివరికి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది పరిస్థితి.
డయాఫ్రాం వాల్ కూలిపోవడంతో పూర్తిగా పనులు ఆగిపోయి ప్రాజెక్టు భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ విషయంలో బాధ్యత తీసుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు. తొలి రెండున్నరేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న అంబటి రాంబాబు ప్రతిపక్ష తెలుగుదేశం మీదే విమర్శలు చేస్తూ, నిందలు చేస్తూ వచ్చారు.
కాగా తాజాగా ఎన్నికల ముంగిట ఓ టీవీ ఛానెల్లో జరిగిన చర్చా వేదికలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్.. తన తర్వాత నీటిపారుదల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అంబటి రాంబాబునే ఇరికించేశారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రాం వాల్ నిర్మించడం తప్పు కదా అని అడిగితే.. మినిమం బేసిక్స్ లేకుండా ఎలా చేశారు అని అడిగితే అనిల్ కుమార్ సమాధానం చెప్పలేకపోయారు.
ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో 40 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు తగ్గిపోవడం, వ్యవసాయం దెబ్బ తినడం గురించి అడిగితే.. అది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ తాను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నంత వరకు అంతా బాగానే ఉందని.. ఆ తర్వాతే సమస్య తలెత్తిందని.. తాను మంత్రిగా దిగిపోయాక తన నియోజకవర్గానికి పరిమితం అయ్యానని.. ఆయకట్టు తగ్గిపోవడంతో తనకు సంబంధం లేదని చెప్పడం ద్వారా పరోక్షంగా అంబటిదే తప్పంతా అని చెప్పకనే చెప్పేశారు అనిల్.
This post was last modified on March 19, 2024 7:26 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…