కూటమి ఆధ్వర్యంలో మొదటి బహిరంగసభ ఆదివారం మధ్యాహ్నం జరగబోతోంది. టీడీపీకి బాగా పట్టున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగసభకు నరేంద్రమోడీ స్వయంగా హాజరవుతున్నారు. అందుకనే అందరి దృష్టి మోడీపైనే నిలిచింది. బహిరంగసభకు మోడీ హాజరవ్వటం, మాట్లాడటం చాలా మామూలే. కాని ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేమిటంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటివకు మంచి సంబంధాలున్నాయి. ఇదే సమయంలో వైసీపీ, బీజేపీలు మాత్రం ఒకదానిపై మరోటి ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి.
తాజా పరిణామాల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టుకట్టింది. ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం వేరు, పార్టీల మధ్య సంబంధాలు వేరు. పైగా ఎన్నికల్లో పార్టీల మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. వైసీపీ-టీడీపీ, వైసీపీ-జనసేన మధ్య సంబంధాలు చాలాకాలంగా ఉప్పునిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి స్ధితిలో వీళ్ళతో బీజేపీ జతకట్టింది. పై మూడుపార్టీల కీలక నేతల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల మొదటి బహిరంగసభకు హాజరవుతున్న మోడీ కూడా జగన్ను టార్గెట్ చేస్తారా ? చేయరా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.
మోడీ మాటలను బట్టి జగన్ పైన వైఖరి ఏమిటనేది అర్ధమవుతుంది. చంద్రబాబు, పవన్ , పురందేశ్వరి లాగే జగన్ పైన మోడీ కూడా ఆరోపణలతో విరుచుకుపడితే ఇప్పటినుండి కథ వేరేగా ఉంటుంది. అలా కాకుండా తూతుమంత్రంగా మాట్లాడినా, జగన్ పైన ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా విషయం మరో రకంగా ఉంటుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా పవన్, పురందేశ్వరి ఎంతగా గొంతుచించుకుంటున్నా కేంద్రప్రభుత్వం పెద్దలు అసలు పట్టించుకోవటంలేదు.
జగన్ ఢిల్లీకి వెళుతునే ఉన్నారు, మోడీ, అమిత్ షాలను కలుస్తున్నారు, నిధులను రిలీజ్ చేయించుకుంటునే ఉన్నారు. కాని ఇపుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అన్న సంబంధాల కన్నా నరేంద్రమోడి, జగన్ అని మాత్రమే చూడాల్సుంటింది. వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న మూడుపార్టీల కూటమి తరపున బహిరంగసభకు హాజరువుతున్నారు కాబట్టి సహజంగానే వైసీపీ ప్రభుత్వంపైన, జగన్ పైన మోడీ ఆరోపణలతో విరుచుకుపడతారని అనుకుంటున్నారు. మరి చివరకు మోడీ ఏమి చేస్తారో చూడాలి.
This post was last modified on March 17, 2024 2:23 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…