Political News

అందరి దృష్టి మోడీ మీదేనా ?

కూటమి ఆధ్వర్యంలో మొదటి బహిరంగసభ ఆదివారం మధ్యాహ్నం  జరగబోతోంది. టీడీపీకి  బాగా పట్టున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగసభకు నరేంద్రమోడీ స్వయంగా హాజరవుతున్నారు. అందుకనే అందరి దృష్టి మోడీపైనే నిలిచింది. బహిరంగసభకు మోడీ హాజరవ్వటం, మాట్లాడటం చాలా మామూలే. కాని ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేమిటంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటివకు మంచి సంబంధాలున్నాయి. ఇదే సమయంలో వైసీపీ, బీజేపీలు మాత్రం ఒకదానిపై మరోటి ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి.

తాజా పరిణామాల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టుకట్టింది. ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం వేరు, పార్టీల మధ్య సంబంధాలు వేరు. పైగా ఎన్నికల్లో పార్టీల మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది.  వైసీపీ-టీడీపీ, వైసీపీ-జనసేన మధ్య సంబంధాలు చాలాకాలంగా ఉప్పునిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి స్ధితిలో వీళ్ళతో బీజేపీ జతకట్టింది.  పై మూడుపార్టీల కీలక నేతల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల మొదటి బహిరంగసభకు హాజరవుతున్న మోడీ కూడా జగన్ను టార్గెట్ చేస్తారా ? చేయరా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.

మోడీ మాటలను బట్టి జగన్ పైన వైఖరి ఏమిటనేది అర్ధమవుతుంది. చంద్రబాబు, పవన్ , పురందేశ్వరి లాగే జగన్ పైన మోడీ కూడా ఆరోపణలతో  విరుచుకుపడితే ఇప్పటినుండి  కథ వేరేగా ఉంటుంది. అలా కాకుండా తూతుమంత్రంగా మాట్లాడినా, జగన్ పైన ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా విషయం మరో రకంగా ఉంటుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా పవన్, పురందేశ్వరి ఎంతగా గొంతుచించుకుంటున్నా కేంద్రప్రభుత్వం పెద్దలు అసలు పట్టించుకోవటంలేదు.

జగన్ ఢిల్లీకి వెళుతునే ఉన్నారు, మోడీ, అమిత్ షాలను కలుస్తున్నారు, నిధులను రిలీజ్ చేయించుకుంటునే ఉన్నారు. కాని ఇపుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అన్న సంబంధాల కన్నా నరేంద్రమోడి, జగన్ అని మాత్రమే చూడాల్సుంటింది. వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న మూడుపార్టీల కూటమి తరపున బహిరంగసభకు హాజరువుతున్నారు కాబట్టి సహజంగానే వైసీపీ ప్రభుత్వంపైన, జగన్ పైన  మోడీ ఆరోపణలతో విరుచుకుపడతారని అనుకుంటున్నారు. మరి చివరకు మోడీ ఏమి చేస్తారో చూడాలి. 

This post was last modified on March 17, 2024 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

1 hour ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

3 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

5 hours ago