ప్రభాస్ సినిమాలంటే వాయిదాలు పడటం చాలా మామూలే అన్నట్లు తయారైంది పరిస్థితి. బాహుబలి తర్వాత తన సినిమాల రేంజికి అనుకున్న సమయానికి పూర్తి చేసి విడుదల చేయడం అంటే కష్టమే. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్.. ఇలా ప్రతి చిత్రం వాయిదాలు పడ్డవే. ‘కల్కి’ మూవీ కూడా ఆల్రెడీ వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్న చిత్రాన్ని వేసవికి వాయిదా వేశారు.
వైజయంతీ మూవీస్ వారికి బాగా కలిసొచ్చిన మే 9వ తేదీని కొత్త రిలీజ్ డేట్గా ఎంచుకున్నారు. ఐతే ఆ డేట్కు సినిమా వస్తుందని పక్కాగా చెప్పలేని పరిస్థితి. భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడి ఉండి.. ఇంకా చిత్రీకరణ చివరి దశలో ఉన్న సినిమాను ఇంకో రెండు నెలల్లో విడుదలకు సిద్ధం చేయడం అసాధ్యం అనే భావిస్తున్నారు. కానీ టీం మాత్రం మే 9 రిలీజ్ విషయంలో ధీమాగా కనిపించింది.
ఐతే ప్రభాస్ అభిమానులు మాత్రం వేసవి విడుదల మీద చాలా తక్కువ ఆశలతో ఉన్నారు. దీనికి తోడు తాజా పరిణామాలు.. ఆ ఆశలు మరింత నీరుగారిపోయేలా చేశాయి. తాజాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఏపీ, తెలంగాణల్లో మే 13కు ఎన్నికల ముహూర్తం కుదిరింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరగనుండగా.. ఏపీలో దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మే రెండో వారానికి పీక్స్లో ఉంటుంది. నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉంచుకుని ‘కల్కి’ లాంటి భారీ సినిమాను రిలీజ్ చేసే సాహసం చేయరు. కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి మే 9న ‘కల్కి’ రిలీజ్ విషయంలో ఆశలు వదులుకోక తప్పదు.
This post was last modified on March 17, 2024 4:09 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…