ఏపీలో ఎన్నికల విధులు, సహా ఇతరత్రా ఎన్నికలకు సంబంధించిన అంశాలకు కూడా వలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ వారిని ఎన్నికల విధులకు అనుమ తించబోమని చెప్పారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం వలంటీర్లను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. ప్రభు త్వానికి, ప్రజలకు మధ్య సారథులుగా వారిని ప్రొజెక్టు చేసింది. ఇటీవల కాలంలో వారే ప్రభుత్వానికి, వైసీపీకి ప్రచారకర్తలుగా మారిపోయారు. దీనిపై అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి.
కొన్నాళ్ల కిందట ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ లు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే ఎన్నికల సంఘం ఫైరైంది. వలంటీర్లను ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని పేర్కొంది. ఇక, ఇప్పుడు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా మరోసారి కూడా వలంటీర్ల వ్యవహారం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లు సహా.. స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఏపీలో వివాదాస్పదమైన వలంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చని తెలిపారు.
This post was last modified on March 16, 2024 6:06 pm
యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చగా మారింది. రూ.2 వేలకు…
హైదరాబాద్లో చదువుకుంటున్న స్కూల్ విద్యార్థినులు 1980ల రోజులను గుర్తు చేశారు. అప్పట్లో కాలేజీకి వెళ్లే విద్యార్థులు బంక్ కొట్టి సినిమాలకు…
కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది, రెండు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్ బస్టర్ గా…
సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు ది ప్యారడైజ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. సాయంత్రం రాత్రి కలిపి రెండు షోలు ప్లాన్…
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా బుధవారం…
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల తర్వాత.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గం పరిధి లో…