Political News

ఏపీలో వ‌లంటీర్ల‌ పై మరో సారి క్లారిటీ ఎన్నిక‌ల సంఘం

ఏపీలో ఎన్నిక‌ల విధులు, స‌హా ఇత‌ర‌త్రా ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌కు కూడా వ‌లంటీర్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందేన‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వారిని ఎన్నిక‌ల విధుల‌కు అనుమ తించ‌బోమ‌ని చెప్పారు. వాస్త‌వానికి ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భు త్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సార‌థులుగా వారిని ప్రొజెక్టు చేసింది. ఇటీవ‌ల కాలంలో వారే ప్ర‌భుత్వానికి, వైసీపీకి ప్ర‌చార‌క‌ర్త‌లుగా మారిపోయారు. దీనిపై అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరాయి.

కొన్నాళ్ల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్ప‌ట్లోనే ఎన్నిక‌ల సంఘం ఫైరైంది. వ‌లంటీర్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని పేర్కొంది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన సంద‌ర్భంగా మ‌రోసారి కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్లు స‌హా.. స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు కూడా ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది.

లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఏపీలో వివాదాస్ప‌ద‌మైన వ‌లంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వ‌లంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చని తెలిపారు.

This post was last modified on March 16, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

38 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

3 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

3 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

3 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

7 hours ago