Political News

ఏపీలో వ‌లంటీర్ల‌ పై మరో సారి క్లారిటీ ఎన్నిక‌ల సంఘం

ఏపీలో ఎన్నిక‌ల విధులు, స‌హా ఇత‌ర‌త్రా ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌కు కూడా వ‌లంటీర్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందేన‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వారిని ఎన్నిక‌ల విధుల‌కు అనుమ తించ‌బోమ‌ని చెప్పారు. వాస్త‌వానికి ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భు త్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సార‌థులుగా వారిని ప్రొజెక్టు చేసింది. ఇటీవ‌ల కాలంలో వారే ప్ర‌భుత్వానికి, వైసీపీకి ప్ర‌చార‌క‌ర్త‌లుగా మారిపోయారు. దీనిపై అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరాయి.

కొన్నాళ్ల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్ప‌ట్లోనే ఎన్నిక‌ల సంఘం ఫైరైంది. వ‌లంటీర్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని పేర్కొంది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన సంద‌ర్భంగా మ‌రోసారి కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్లు స‌హా.. స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు కూడా ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది.

లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఏపీలో వివాదాస్ప‌ద‌మైన వ‌లంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వ‌లంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చని తెలిపారు.

This post was last modified on March 16, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

23 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago