Political News

క‌మ్మ ఓట్లు గుండుగుత్త‌గా కాంగ్రెస్‌కే.. ఇదీ ఎఫెక్ట్‌!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను గుండుగుత్త‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో బ‌ల‌మైన అడుగు వేసింది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్మ ఓటు బ్యాంకు త‌ట‌స్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా క‌మ్మ ఓటు బ్యాంకు ప‌నిచేస్తోంది. అందుకే గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ ఓట్టు బీఆర్ ఎస్‌కే ప‌డ్డాయ‌నే అంచ‌నా ఉంది.

అయితే, బీఆర్ ఎస్ పార్టీని మ‌రింత బ‌ల‌హీన పరిచేందుకు , త‌న ప్ర‌భుత్వంపై చేస్తున్న కూల్చేస్తాం.. కూలిపోతుంది.. అనే కామెంట్ల‌కు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యాలతో దూసుకు పోతున్నారు. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. బ‌ల‌మైన నాయ‌కుల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే క‌మ్మ ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు తాజాగా క‌మ్మ కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు.

క‌మ్మ సామాజిక వ‌ర్గంలో వెనుక బ‌డిన వారికి ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేకంగా సాయం అందించేందుకు ఈ కార్ప‌రేష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు తాజాగా ఇచ్చిన జీవోలో ప్ర‌భుత్వం పేర్కొంది. మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ అమ‌ల్లోకి రానున్న నేప‌థ్యంలో ఈ జీవోను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా గౌడ‌లు, బ‌లిజ‌, రెడ్లు ఉన్నారు. వీరితోపాటు క‌మ్మ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. మెజారిటీ క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆర్థికంగా వెనుక‌బ‌డి ఉంది.

ఈ క్ర‌మంలో త‌మ‌ను కూడా ఆదుకునేందుకు ప్ర‌భుత్వం చొర‌వ చూపాల‌ని ప్ర‌భుత్వానికి విన‌తులు వ‌స్తు న్నాయి. మ‌రోవైపు మ‌ల్కాజిగిరి స‌హా చేవెళ్ల, సికింద్రాబాద్‌ వంటిప‌లు కీల‌క పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. క‌మ్మ ఓటు బ్యాంకు కీల‌కంగా ఉంది. ఈ నేప‌థ్యంలో వారు కోరుతున్న‌ట్టుగా క‌మ్మ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. దీనివ‌ల్ల వారిని సంతృప్తి ప‌రిచిన‌ట్టు ఉండ‌డ‌మే కాకుండా.. రాజ‌కీయంగా కూడా త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 15, 2024 6:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

26 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

2 hours ago