పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా కమ్మ ఓటు బ్యాంకు పనిచేస్తోంది. అందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్టు బీఆర్ ఎస్కే పడ్డాయనే అంచనా ఉంది.
అయితే, బీఆర్ ఎస్ పార్టీని మరింత బలహీన పరిచేందుకు , తన ప్రభుత్వంపై చేస్తున్న కూల్చేస్తాం.. కూలిపోతుంది.. అనే కామెంట్లకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి సంచలన నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. బలమైన నాయకులను కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కమ్మ ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు తాజాగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కమ్మ సామాజిక వర్గంలో వెనుక బడిన వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా సాయం అందించేందుకు ఈ కార్పరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ఇచ్చిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ జీవోను విడుదల చేయడం గమనార్హం. తెలంగాణ లో బలమైన సామాజిక వర్గంగా గౌడలు, బలిజ, రెడ్లు ఉన్నారు. వీరితోపాటు కమ్మలు ఉన్నప్పటికీ.. మెజారిటీ కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా వెనుకబడి ఉంది.
ఈ క్రమంలో తమను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ప్రభుత్వానికి వినతులు వస్తు న్నాయి. మరోవైపు మల్కాజిగిరి సహా చేవెళ్ల, సికింద్రాబాద్ వంటిపలు కీలక పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా.. కమ్మ ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వారు కోరుతున్నట్టుగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గమనార్హం. దీనివల్ల వారిని సంతృప్తి పరిచినట్టు ఉండడమే కాకుండా.. రాజకీయంగా కూడా తమకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on March 15, 2024 6:12 pm
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…