పిఠాపురం.. ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రెండు రకాలుగా ఈ నియోజకవర్గంపై చర్చ సాగుతోంది. ఒకటి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు పిఠాపురం సమాధానం చెప్పింది. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై జనసైనికులు.. పవన్ అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇక, రెండోది.. పవన్ ప్రకటన తర్వాత.. పిఠాపురంలో రేగిన అలజడి.
పిఠాపురం టికెట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరును దుయ్యబడుతూ. ఇక్కడి వారు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరుతో ఉన్న బ్యానర్లు, కటౌట్లను తగల బెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు.. ఎవరిని అడిగి టికెట్ పవన్కు ఇచ్చారని కూడా నిలదీశారు. మరోవైపు పవన్ పోటీ చేసినా .. ఆయనను ఓడిస్తామన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం తో పిఠాపురం రెండు రకాలుగా చర్చకు వచ్చింది.
పిఠాపురం టీడీపీ నాయకుడు ఎస్వీఎస్ ఎన్ వర్మ పేరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. దీంతో వర్మ ఎవరు? ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? ఆయనకు టీడీపీకి సంబంధం ఎంత బలంగా ఉంది? ఆయనకు నిజంగానే అన్యాయం చేస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. సత్యనారాయణ వర్మ.. 2009 ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలో 2014లో వర్మ ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఏకంగా 47వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయనను మరోసారి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే 2019 టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ నేత పెండెం దొరబాబుపై వర్మ ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. ఆయనకు సంబంధించి సర్వే చేయించిన చంద్రబాబు ఈ సీటును జనసేనకు కేటాయించారు. దీనిని వ్యతిరేకిస్తూ.. వర్మ వర్గీయులు హడావుడి చేశారు. వాస్తవానికి వర్మది వాపే కానీ.. బలుపు కాదనేది స్థానికంగా వినిపిస్తున్న మాట.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…