Political News

ఒక్క వీడియోతో దుమ్ము రేపిన ‘జ‌న‌సేన‌’

ఎన్నిక‌ల వేళ.. నాయ‌కులు చెప్పే ఒక్క మాట‌కైనా వాల్యూ ఎక్కువ‌గానే ఉంటుంది. అలాంటి ఒక్క వీడి యో విడుద‌ల చేసినా.. దాని ప‌వ‌ర్ వేరేగా ఉంటుంది. తాజాగా జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో దుమ్ము రేపుతోంది. షార్ట్ ఫిలిమే అయినా.. మాట‌లు.. మంత్రాలు, హామీలు లేక‌పోయినా.. ఈ వీడియో దుమ్ము రేపుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌నసేన పార్టీ కార్యాల‌యంలో గురువారం రాత్రి విడుద‌ల చేసి ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది.

ఒక్క మాట కూడా లేకుండానే, ఒక్క వాద‌న కూడా లేకుండానే ఈ వీడియోను చిత్రీక‌రించారు. రాష్ట్ర ప్ర‌జ లు 2019లో భారీ మెజారిటీతో వైసీపీకి ప‌ట్ట‌క‌ట్టారు. దీనిని సింబాలిక్‌గా ఒక రూంలోని సీలింగ్ ఫ్యాను తీవ్ర వేగంతో తిరుగుతున్న‌ట్టుగా చూపించారు. అయితే.. ఇంత బ‌ల‌మైన మెజారిటీ ల‌భించ‌డంతో(అంత వేగం ) ఫ్యాను ఇష్టానుసారం తిరిగి..  రాజ‌ధాని, పోల‌వ‌రం, ఇత‌ర ప్రాజెక్టులు, అభివృద్ధి అనేది ఏమాత్రం ప‌ట్టిం చుకోలేద‌నే విష‌యాన్ని సింబాలిక్‌గా చూపించారు.

ఫ్యాను గాలి(పాల‌న‌)కి ప్రాజెక్టులు(పేప‌ర్లుగా చూపించారు) కొట్టుకు పోతుండ‌గా.. చెల్లాచెదురు అవుతుండ గా.. ఆ ఫ్యాను వేగాన్ని అదుపు చేసి.. ఆయా ప్రాజెక్టుల‌ను(పేప‌ర్లు) ఒక చోటకు చేర్చి.. ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో వాటిని ఏర్చి కూర్చి.. వాటిపై `గాజు గ్లాసు`ను పెట్ట‌డం, బ్యాక్ గ్రౌండ్‌లో `వందే మాత‌రం` మ్యూజిక్ రూపం లో వినిపించ‌డంతో షార్ట్ ఫిలిం అయిపోతుంది. ఈ ఫిలింలో ప‌వ‌న్ స్వ‌యంగా న‌టించినా.. ఎక్కడా ఆయ‌న ఫేస్ క‌నిపించ‌దు. ఎండింగ్‌లో మాత్రం.. `బీజేపీ-టీడీపీ-జ‌నసేన‌` పార్టీల సంయుక్త సింబ‌ల్ మాత్రం ద‌ర్శ‌న‌మిస్తుంది. ప్ర‌స్తుతం ఈ షార్ట్ ఫిలం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

This post was last modified on March 15, 2024 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago