Political News

‘మీరు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చా.. ఆశీర్వ‌దించండి’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారి పేర్ల‌ను విడుద‌ల చేశారు. గ‌తంలోనే తొలి జాబితా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు అప్ప‌ట్లో 94 మంది అభ్య‌ర్థుల‌ను ఏక‌బిగిన విడుద‌ల చేసేశారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన పొత్తుల్లో భాగంగా టీడీపీకి దక్కిన 144 స్థానాల్లో మిగిలిన 50 సీట్ల‌కు సంబంధించి 34 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో కొంద‌రు వార‌సుల‌కు కూడా టికెట్లు కేటాయించారు. అదేవిధంగా కురువృద్ధుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆశ‌లు ఫ‌లించేలా చేశారు.

అదేవిధంగా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డికి ఆత్మ‌కూరు టికెట్‌ను కేటాయించారు. వెంక‌ట‌గిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ కోడలు కురుగొండ్ల ల‌క్ష్మీప్రియ‌కు అప్ప‌గించారు. మొత్తానికి ఆశావ‌హుల‌కు నిరాశ క‌ల‌గ‌కుండా చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గానే రెండో జాబితాను ఎంపిక చేశారు. ఇదిలావుంటే.. జాబితాను ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్యలు చేశారు.

మీరు చెప్పిన వారికే, మీ అభిప్రాయం మేర‌కే టికెట్లు ఇచ్చాన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల స‌ర్వే ఆదారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశాన‌ని, ఇప్ప‌టికే తొలిజాబితాను ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. మ‌రో 34 మందితో రెండో జాబితాను విడుద‌ల చేశామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ జాబితాలోనూ ప్ర‌జ‌ల అభి ప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. వీరిని ఆశీర్వ‌దించి.. తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్థు ల‌ను గెలిపించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

This post was last modified on March 14, 2024 3:59 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

5 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

5 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

6 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

7 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

7 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

7 hours ago