టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారి పేర్లను విడుదల చేశారు. గతంలోనే తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు అప్పట్లో 94 మంది అభ్యర్థులను ఏకబిగిన విడుదల చేసేశారు. ఇక, ఇప్పుడు బీజేపీ, జనసేన పొత్తుల్లో భాగంగా టీడీపీకి దక్కిన 144 స్థానాల్లో మిగిలిన 50 సీట్లకు సంబంధించి 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో కొందరు వారసులకు కూడా టికెట్లు కేటాయించారు. అదేవిధంగా కురువృద్ధుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆశలు ఫలించేలా చేశారు.
అదేవిధంగా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్ను కేటాయించారు. వెంకటగిరి టికెట్ను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోడలు కురుగొండ్ల లక్ష్మీప్రియకు అప్పగించారు. మొత్తానికి ఆశావహులకు నిరాశ కలగకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తగానే రెండో జాబితాను ఎంపిక చేశారు. ఇదిలావుంటే.. జాబితాను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీరు చెప్పిన వారికే, మీ అభిప్రాయం మేరకే టికెట్లు ఇచ్చానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల సర్వే ఆదారంగానే అభ్యర్థులను ఎంపిక చేశానని, ఇప్పటికే తొలిజాబితాను ప్రకటించామని తెలిపారు. మరో 34 మందితో రెండో జాబితాను విడుదల చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ జాబితాలోనూ ప్రజల అభి ప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. వీరిని ఆశీర్వదించి.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
This post was last modified on March 14, 2024 3:59 pm
ఉత్తరాది హారర్ కామెడీ అనే జానర్ కు కమర్షియల్ రేంజ్ తీసుకొచ్చిన ఘనత లారెన్స్ రాఘవేంద్రకే దక్కుతుంది. ముని సినిమా…
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…