బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పిలిచి.. చాలించి.. బుజ్జగించారు. టికెట్ ఇస్తామని కూడా చెప్పా రు. అయినా… ఆయన వినిపించుకోలేదు. రావడమైతే వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ.. ఈ క్రమంలో చోటు చేసుకున్న హైడ్రామాకు తెర కూడా దించారు. కానీ, మనసు మాత్రం మార్చుకోలేక పోయారు. చివరకు తాను చేయాలని అనుకున్నదే చేస్తున్నారు. ఆయనే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే.
తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బుధవారమే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. వరంగల్లో ప్రెస్మీట్ పెట్టి తన రాజీనామాను ప్రకటించడానికి ముందు బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని ఆయనను బలవంతంగా హైదరాబాద్లో నందినగర్లోని అధినేత కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చా రు. ఆయనతో సమావేశం అనంతరం తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ప్రకటించి ఊహాగానాలకు తెరదించారు. ఈ హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని కేసీఆర్ సమక్షంలో ప్రకటించిన ఆరూరి.. గంటలు కూడా గడవకముందే పార్టీకి భారీ షాకిచ్చారు. బీజేపీలో చేరేందుకు ఈ ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తినకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనాయకులు నడ్డా సహాతో ఇతర ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు ముహూర్తం బాగుండడంతో ఆయన పార్టీలో చేరిపోవడం కూడా ఖాయమని కూడా అంటున్నారు.
మరి కేసీఆర్ రాయబారం, ఆయన బుజ్జగింపులు ఫలించకపోవడం.. అధినేతే చెప్పినా.. పార్టీపై భరోసా కల్పించలేకపోవడం వంటివి ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీకి ఒకదాని వెంట ఒకటి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతుండడం.. నాయకులు అధినేత మాటను కూడా ఖాతరు చేయకుండా జారుకోవడం వంటివి ఇప్పుడు బీఆర్ ఎస్ ఉనికికే ప్రశ్నార్థకంగా మారడం గమనార్హం.
This post was last modified on March 14, 2024 3:56 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…