టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 21 సీట్లలో కేవలం ఐదుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో, మిగతా 16 మంది అభ్యర్థులు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు, కాకినాడ ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పుకార్లకు చెక్ పెడుతూ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు గా పవన్ కళ్యాణ్ స్వయంగా సంచలన ప్రకటన చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్తలతో జరుగుతున్న సమావేశంలో పవన్ ఈ విషయం వెల్లడించారు. ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని పవన్ క్లారిటీనిచ్చారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి రెండు చోట్ల పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న పిఠాపురంలో పవన్ పోటీకి దిగబోతున్నారు.
అయితే, పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది.
మరోవైపు, తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి ఈ రోజు జనసేనలో చేరారు. నరహరికి కండువా కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు గంటా నరహరి బంధువు. 2017-18 లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారాన్ని నరహరి అందుకున్నారు. బెంగళూరు కేంద్రంగా ఆయన వ్యాపారాలు సాగిస్తుంటారు. నరహరి జనసేన తరఫున తిరుపతి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.
This post was last modified on March 14, 2024 3:45 pm
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…