Political News

వైఎస్ షర్మిల మౌనం దేనికి సంకేతం.?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చారు వైఎస్ షర్మిల. వస్తూనే, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా అవకాశమూ దక్కించుకున్నారు. అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పని చేశారామె. ఓ దశలో వైసీపీ తెలంగాణ పగ్గాలు ఆమె చేపడతారనే ప్రచారమూ జరిగింది. అయితే, తెలంగాణలో వైసీపీ జెండా పీకేసిన తర్వాత.. కాస్త గ్యాప్ తీసుకుని, తెలంగాణలో కొత్త జెండా, ఎజెండాతో కొత్త రాజకీయ పార్టీని వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా మూణ్ణాళ్ళ ముచ్చటగానే అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేక, చేతులెత్తేసి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు షర్మిల. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేశారు. ఇంతా చేసి వైఎస్ షర్మిల దక్కించుకున్నది ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఓ పదవి.

ఏపీసీసీ అధ్యక్షురాలు అవుతూనే, వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ, జగన్ మీద విమర్శల దాడి చేస్తూ వార్తల్లోకెక్కిన వైఎస్ షర్మిల, ఈ మధ్య కాస్త మౌనం దాల్చారు. కుమారుడి పెళ్ళి అనంతరం వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా కొంత నెమ్మదించడం (రాజకీయ కోణంలో) పలు అనుమానాలకు తావిస్తోంది.

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటైన దరిమిలా, వైసీపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలవనుందా.? అన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సానుకూలతా కనిపించలేదు. కానీ, తెరవెనుక వ్యవహారాలు శరవేగంగా మారుతున్నాయట.

వైఎస్ జగన్ స్వయంగా తన చెల్లెలు షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారంటూ టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. వైసీపీ – కాంగ్రెస్ గనుక కలిస్తే, అది వైసీపీకి కొంత అదనపు బలం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత అడ్వాంటేజ్ అవుతుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.

This post was last modified on March 14, 2024 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

13 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

1 hour ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago