ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణమే మరో సంచలన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదే.. పిఠాపురం నియోజకవర్గం నుంచితాను కూడా పోటీ చేస్తున్నట్టు సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“మీకో బ్రేకింగ్ న్యూస్.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయి తే.. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారనేది చెప్పలేదు. అంతేకాదు.. ఎందుకు పోటీ చేయాలని భావి స్తున్నట్టు కూడా వెల్లడించలేదు. అయితే.. పవన్ను తరచుగా సోషల్ మీడియా వేదికగా వర్మ విమర్శిస్తూ ఉంటారు. ఆయన విధానాలను కూడా తప్పుబడుతుంటారు. పార్టీకి కనీసం బూత్ స్థాయిలో నాయకులు కార్యకర్తలు కూడా లేరని పెదవి విరుస్తారు.
ఇలాంటి వ్యక్తి అనూహ్యంగా పవన్ పోటీ చేస్థానని ప్రకటించిన స్థానం నుంచి ఆ వెంటనే తాను కూడా బరిలో ఉన్నానని ప్రకటించడం వెనుక రాజకీయంగా ఏదో సంచలనం సృష్టించేందుకేనని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ ఈయనకు టికెట్ ఇస్తుందా? అంటే.. ఎట్టి పరిస్థతిలోనూ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. సో.. ఎలా చూసుకున్నా ఆర్జీవీ ప్రకటన కేవలం ఏదో ఒక విధంగా చర్చకు దారితీయాలన్న వ్యూహం మాత్రమే కనిపించేలా చేస్తోంది.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడా? అని కొన్నాళ్లుగా పార్టీ ఎదురు చూస్తోంది. ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలని నిర్ణయించున్న దరిమిలా పవన్ పోటీ చేసే స్థానం కోసం వేచి ఉంది. ఇక, ఇప్పుడు పిఠాపురం అని తేలి పోయిన నేపథ్యంలో బలమైన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి అవకాశం ఇచ్చే చాన్స్ కనిపిస్తొంది. మరి ఏం చేస్తారో చూడాలి.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…