ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణమే మరో సంచలన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదే.. పిఠాపురం నియోజకవర్గం నుంచితాను కూడా పోటీ చేస్తున్నట్టు సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“మీకో బ్రేకింగ్ న్యూస్.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయి తే.. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారనేది చెప్పలేదు. అంతేకాదు.. ఎందుకు పోటీ చేయాలని భావి స్తున్నట్టు కూడా వెల్లడించలేదు. అయితే.. పవన్ను తరచుగా సోషల్ మీడియా వేదికగా వర్మ విమర్శిస్తూ ఉంటారు. ఆయన విధానాలను కూడా తప్పుబడుతుంటారు. పార్టీకి కనీసం బూత్ స్థాయిలో నాయకులు కార్యకర్తలు కూడా లేరని పెదవి విరుస్తారు.
ఇలాంటి వ్యక్తి అనూహ్యంగా పవన్ పోటీ చేస్థానని ప్రకటించిన స్థానం నుంచి ఆ వెంటనే తాను కూడా బరిలో ఉన్నానని ప్రకటించడం వెనుక రాజకీయంగా ఏదో సంచలనం సృష్టించేందుకేనని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ ఈయనకు టికెట్ ఇస్తుందా? అంటే.. ఎట్టి పరిస్థతిలోనూ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. సో.. ఎలా చూసుకున్నా ఆర్జీవీ ప్రకటన కేవలం ఏదో ఒక విధంగా చర్చకు దారితీయాలన్న వ్యూహం మాత్రమే కనిపించేలా చేస్తోంది.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడా? అని కొన్నాళ్లుగా పార్టీ ఎదురు చూస్తోంది. ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలని నిర్ణయించున్న దరిమిలా పవన్ పోటీ చేసే స్థానం కోసం వేచి ఉంది. ఇక, ఇప్పుడు పిఠాపురం అని తేలి పోయిన నేపథ్యంలో బలమైన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి అవకాశం ఇచ్చే చాన్స్ కనిపిస్తొంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 14, 2024 4:53 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…