Political News

విడివాడ‌, ప‌ద్మ‌నాభం.. YCPకి ప్ల‌స్ అవుతారా?

కాపుల‌ను ఏకం చేయ‌డం.. వారి ఓటు బ్యాంకు బ‌ద్నాం కాకుండా త‌న‌కు అనుకూలంగా మార్చు కోవ‌డం వంటి కీలక వ్యూహాల దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే కాపు ఉద్య‌మ నాయ‌కుడు.. కేంద్ర‌ మాజీ మంత్రి ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్న విష‌యం తెలిసిందే. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌ల‌కు, త‌న అబిమానుల‌కు లేఖ రాశారు. తాను వైసీపీలో చేరుతున్న‌ట్టు తెలిపారు.

ఈ నెల 14న సీఎం జ‌గ‌న్ పిలుపు మేరకు తాను వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. తాను 14వ తేదీన కిర్లంపూడిలోని త‌న నివాసం నుంచి బ‌య‌లు దేరి సీఎంజ‌గ‌న్ స‌మక్షంలో పార్టీలో చేరుతున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే..తాను ఎలాంటి త‌ప్పుడు ప‌నిచేయ‌లేద‌ని.. చేయ‌బోన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌ని.. మీ బిడ్డ‌గా తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల‌ని కోరారు. అయితే.. ఆయ‌న వెంట ఎంత మంది కాపులు ప్ర‌యాణిస్తార‌నేది చూడాలి.

మ‌రో కీల‌క నేత విడివాడ రామ‌చంద్ర‌రావుకు త‌ణుకు టికెట్ ఇస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆయ‌న‌తో బాగానే ఖ‌ర్చు పెట్టించార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే..ఈ టికెట్ కూడా ద‌క్క‌లేదు. పోనీ..ప‌వ‌న్ . ఇలాంటి కీల‌క నేత‌ల‌ను పిలిచి మాట్లాడింది కూడా లేదు. ఫ‌లితంగా విడివాడ కొంత సంయమ‌నం పాటించినా.. కాపుల నుంచి వ‌స్తున్న వ‌త్తిళ్లు.. భ‌విష్య‌త్ రాజ‌కీయంపై గంద‌ర‌గోళం నెల‌కొన్న నేపథ్యంలో జ‌న‌సేన‌లో ఉండ‌లేన‌ని తాజాగా నిర్ణ‌యించుకున్నారు.

తాజాగా అనుచరుల స‌మావేశంలో ఆయ‌న వైఎస్సార్ సీపీలో చేరేందుకు దాదాపు ఒక క్లారిటీకి వ‌చ్చార‌ని తెలిసింది. మొత్తంగా చూస్తే.. తూర్పు గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయాలు మారుతున్న నేప‌థ్యంలో ఇది ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నీయ‌బోమ‌న్న జ‌న‌సేనకు మైన‌స్ అవుతుండ‌గా, అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి ప్ల‌స్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 13, 2024 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

20 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

7 hours ago