కాపులను ఏకం చేయడం.. వారి ఓటు బ్యాంకు బద్నాం కాకుండా తనకు అనుకూలంగా మార్చు కోవడం వంటి కీలక వ్యూహాల దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంతలోనే కాపు ఉద్యమ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు, తన అబిమానులకు లేఖ రాశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు.
ఈ నెల 14న సీఎం జగన్ పిలుపు మేరకు తాను వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తాను 14వ తేదీన కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయలు దేరి సీఎంజగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అయితే..తాను ఎలాంటి తప్పుడు పనిచేయలేదని.. చేయబోనని కూడా ఆయన వెల్లడించడం గమనార్హం. తనను ప్రజలు ఆశీర్వదించాలని.. మీ బిడ్డగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. అయితే.. ఆయన వెంట ఎంత మంది కాపులు ప్రయాణిస్తారనేది చూడాలి.
మరో కీలక నేత విడివాడ రామచంద్రరావుకు తణుకు టికెట్ ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆయనతో బాగానే ఖర్చు పెట్టించారనే చర్చ సాగుతోంది. అయితే..ఈ టికెట్ కూడా దక్కలేదు. పోనీ..పవన్ . ఇలాంటి కీలక నేతలను పిలిచి మాట్లాడింది కూడా లేదు. ఫలితంగా విడివాడ కొంత సంయమనం పాటించినా.. కాపుల నుంచి వస్తున్న వత్తిళ్లు.. భవిష్యత్ రాజకీయంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో జనసేనలో ఉండలేనని తాజాగా నిర్ణయించుకున్నారు.
తాజాగా అనుచరుల సమావేశంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరేందుకు దాదాపు ఒక క్లారిటీకి వచ్చారని తెలిసింది. మొత్తంగా చూస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమన్న జనసేనకు మైనస్ అవుతుండగా, అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి ప్లస్ అవుతుండడం గమనార్హం.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…