వివాదాలకు కేంద్రంగా మారిన మహిళా ఐఏఎస్ స్మితా సభర్వాల్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నార ని అంటున్నారు రాజకీయ నాయకులు. గిరిజన శాఖ మంత్రి సీతక్క ముందు ఓ ఐఏఎస్ అధికారిగా కాలిపై కాలేసుకుని కూర్చున్న వ్యవహారం రాజకీయంగా వివాదానికి దారితీసింది. వాస్తవానికి మంత్రుల ముందు అధికారులు కూర్చుకునేందుకు కొన్ని ప్రొటోకాల్ నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించా లి. ఒక్క మంత్రి ముందు మాత్రమే కాదు.. తన ఉన్నతాధికారి ముందు కూడా.. జాగ్రత్తగా ఉండాలని రూల్స్ బుక్ చెబుతోంది.
కానీ, ఏ మాత్రం ప్రొటోకాల్ నిబంధనలు పాటించకుండా.. పైగా కాలిపై కాలేసుకున్న స్మిత సభర్వాల్.. గడుసు సమాధానం చెప్పడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా చేశారు. మంత్రి ముందు ఎలా కూర్చోవాలో రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అని ఆమె ప్రశ్నించారు. ఎలా కూర్చుంటే.. ఎవరికి కావాలి? నేను ఎలా ఉన్నా.. అది నాకు సౌకర్యంగా ఉంటే చాలు.. అని వ్యాఖ్యానించారు.
తన వయసు ఇప్పుడు 47 సంవత్సరాలని, ఈ వయసులో ఎలా కూర్చోవాలో, ఎలా నిల్చోవాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. నిజానికి అందులో ఎలాంటి వివాదమూ లేదని, ఎవరో ఫొటోగ్రాఫర్ దానిని క్లిక్ మనిపిస్తే మరెవరో దానిని ట్రోల్ చేశారని, ఒకరకంగా ఈ వివాదానికి మీడియానే కారణమని గడుసుగా వ్యాఖ్యానించారు.
ఏం జరిగిందంటే..
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక మంత్రి సీతక్కతో స్మితా సభర్వాల్ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎదురుగా ఆమె కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఓ ఆదివాసీ నాయకురాలితో ప్రవర్తించేది ఇలాగేనా? అంటూ మండిపడ్డారు. ఇది అహంకారం తప్ప మరోటి కాదని నెటిజన్లు దుయ్యబట్టారు.దీనిపై స్మిత ఓ మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా గడుసు సమాధానం చెప్పడం గమనార్హం.
This post was last modified on March 13, 2024 5:26 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…