Political News

ఈ ముగ్గురిలో ఎవరికి వస్తాదో

మూడు పార్టీల కూటమి మధ్య కొన్ని సీట్లలో పంచాయితీలు పెరిగిపోతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో డిసైడ్ అయ్యింది. అలాగే మూడు పార్టీలు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కూడా చాలావరకు నిర్ణయమైపోయాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఆ జాబితా అధినేతల దగ్గరే ఉన్న కారణంగా పార్టీ నేతలకు చేరలేదు. అయితే లీకుల రూపంలో సీట్ల వివరాలు బయటకు వచ్చేస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతల మధ్య పొలిటికల్ వేడి పెరిగిపోతోంది. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఒకటి

ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మూడు పార్టీల నేతలు ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. దాంతో పోటీ అనివార్యంగా పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే తెనాలిలో పోటీ చేయలేకపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీకి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో చెబితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దాంతో ఆలపాటి అలిగి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జనసేన తరపున పోటీచేయటానికి బోనబోయిన శ్రీనివాసయాదవ్ పేరు గట్టిగా వినబడుతోంది. ఎందుకంటే యాదవ్ చాలాకాలంగా పోటీచేసే ఉద్దేశ్యంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

అలాగే పొత్తులో కొత్తగా చేరిన బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ కూడా పశ్చిమ నియోజకవర్గంలో పోటీకి రెడీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్న కారణంగా బీజేపీ కూడా ప్రభాకర్ పోటీచేస్తే బాగుంటుందని సీటుకోసం గట్టిగా పట్టుబడుతోంది. సతీష్ 2014,19 ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన అనుభవం ఉన్న నేత. కాబట్టి మూడో ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ప్రభాకర్ చాలా కాన్ఫిడెంటుగా చెబుతున్నారు.

వీళ్ళే కాకుండా ఇంకా కొందరు నేతలు కూడా టికెట్ కోసం ట్రై చేసుకుంటున్నారు. టీడీపీలో ఆలపాటికి పోటీగా గాళ్ళ మాధవీలత కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈమె టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకుంటున్నారు. మూడుపార్టీల నుండి ఇంతమంది పోటీపడుతున్న గుంటూరు పశ్చిమం నియోజకవర్గంలో సీటు ఏ పార్టీకి వెళుతుందో ? పోటీలో ఎవరుంటారో చూడాల్సిందే.

This post was last modified on March 13, 2024 5:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

13 minutes ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

40 minutes ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

49 minutes ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

53 minutes ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

5 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

9 hours ago