మూడు పార్టీల కూటమి మధ్య కొన్ని సీట్లలో పంచాయితీలు పెరిగిపోతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో డిసైడ్ అయ్యింది. అలాగే మూడు పార్టీలు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కూడా చాలావరకు నిర్ణయమైపోయాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఆ జాబితా అధినేతల దగ్గరే ఉన్న కారణంగా పార్టీ నేతలకు చేరలేదు. అయితే లీకుల రూపంలో సీట్ల వివరాలు బయటకు వచ్చేస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతల మధ్య పొలిటికల్ వేడి పెరిగిపోతోంది. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఒకటి
ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మూడు పార్టీల నేతలు ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. దాంతో పోటీ అనివార్యంగా పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే తెనాలిలో పోటీ చేయలేకపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీకి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో చెబితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దాంతో ఆలపాటి అలిగి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జనసేన తరపున పోటీచేయటానికి బోనబోయిన శ్రీనివాసయాదవ్ పేరు గట్టిగా వినబడుతోంది. ఎందుకంటే యాదవ్ చాలాకాలంగా పోటీచేసే ఉద్దేశ్యంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
అలాగే పొత్తులో కొత్తగా చేరిన బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ కూడా పశ్చిమ నియోజకవర్గంలో పోటీకి రెడీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్న కారణంగా బీజేపీ కూడా ప్రభాకర్ పోటీచేస్తే బాగుంటుందని సీటుకోసం గట్టిగా పట్టుబడుతోంది. సతీష్ 2014,19 ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన అనుభవం ఉన్న నేత. కాబట్టి మూడో ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ప్రభాకర్ చాలా కాన్ఫిడెంటుగా చెబుతున్నారు.
వీళ్ళే కాకుండా ఇంకా కొందరు నేతలు కూడా టికెట్ కోసం ట్రై చేసుకుంటున్నారు. టీడీపీలో ఆలపాటికి పోటీగా గాళ్ళ మాధవీలత కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈమె టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకుంటున్నారు. మూడుపార్టీల నుండి ఇంతమంది పోటీపడుతున్న గుంటూరు పశ్చిమం నియోజకవర్గంలో సీటు ఏ పార్టీకి వెళుతుందో ? పోటీలో ఎవరుంటారో చూడాల్సిందే.
This post was last modified on March 13, 2024 5:37 pm
వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21…
తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సంబంధించి ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. చివరగా ఈ చిత్రం…
వైసీపీలో తొలిసారి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏమవుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయడం…
రాను రాను రీ రిలీజులు చాలా రిస్కీ వ్యవహారాలుగా మారిపోతున్నాయి. ఏది వర్కౌట్ అవుతుందో ఏది పోతుందో ముందే పసిగట్టడంలో…