Political News

24 నుంచి 21….  3 నుంచి 2…ఏ కోణంలో చూడాలి !

జనసేన సీట్లు తగ్గడం వైసీపీని బాధించిందా? చిత్రంగా అనిపించినా.. ఇది నిజ‌మే. ఎందుకంటే, త‌న‌ను తాను త‌గ్గించుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు. పైగా ప్ర‌జ‌ల్లోనూ సింప‌తీ వ‌స్తుంది. ఈ వ్యూహానికి ప్ర‌ధాన ప్ర‌ాతిప‌దిక‌.. బీజేపీని స్వ‌యంగా ప‌వ‌నే ఆహ్వా నించ‌డం. ఈ కార‌ణంగానే ఆయ‌న త‌న‌ను తాను త‌గ్గించుకున్నారు. మొదట్లో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 24 సీట్లు ద‌క్కాయి. అయితే.. అనూహ్యంగా ఆ పార్టీ 21కి ఇప్పుడు త‌గ్గించుకోవాల్సి వ‌చ్చింది దీనికి ప్ర‌ధానం గా బీజేపీకి త్యాగం చేయ‌డ‌మే.

అయితే, ఇలా త‌గ్గించుకున్నంత మాత్రాన జ‌న‌సేన‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. కీలక‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీకిదిగుతోంది. అంత‌కు మించి తీసుకున్నా.. వృథా ప్ర‌యాసే అవుతుంద‌నే అంచ‌నాలు వున్నాయి. అంతేకాదు.. క‌నీసంలో క‌నీసం తీసుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా.. విజ‌యంద‌క్కించుకోక పోతే.. అస‌లు పార్టీపైనా మ‌స‌క ముసురుకు నే అవ‌కాశం ఉంది. అందుకే… చాలా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించారు.

నొప్పించ‌క‌.. తానొవ్వ‌క‌.. అన్న‌ట్టుగా.. జ‌నసేన అధినేత టికెట్ల వ్య‌వ‌హారంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 21 స్థానాల‌కు అసెంబ్లీ ని ప‌రిమితం చేసుకున్నా.. గెలుపు గుర్రాల‌కే ఆయ‌న టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో సేనంతా.. ఈ విజ‌యంపైనే దృష్టి పెడితే.. గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అందుకే.. 24 సీట్లు తీసుకున్న‌ప్పుడు.. ఉన్న‌న్ని విమ‌ర్శ‌లు ఇప్పుడు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఒక‌ర‌కంగా ఆలోచ‌న దిశ‌గానే జ‌న‌సేన నాయ‌కులు అడుగులు వేస్తున్నారు.

ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ.. జ‌న‌సేన రెండుకు ప‌రిమిత‌మైంది. మ‌చిలీప‌ట్నంలో వ్య‌క్తి ఆధారిత ఎన్ని క‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ  నుంచి బాల‌శౌరి జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేయ‌నున్నారు. ఈయ‌న‌కు ఇక్క డ మంచి పేరుంది. సో.. ఆయ‌న గెలుపు ఖాయం. ఇక‌, అన‌కాప‌ల్లిలో కాపు సామాజిక వ‌ర్గం ప‌వ‌న్ వెంటే న‌డుస్తోంది. ఇది కూడా.. ఇక్క‌డ ప్ల‌స్ కానుంది. ఫ‌లితంగా తీసుకున్నది రెండే అని పెద‌వి విర‌వ‌డం క‌న్నా.. తీసుకున్న అన్ని సీట్ల‌లోనూ గెలిచామ‌నే ట్రాక్ రికార్డు ముఖ్య‌మ‌నే దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో ఈ సంఖ్య‌ల‌కంటే.. దూర‌దృష్టికే ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. 

This post was last modified on March 13, 2024 5:09 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

13 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

2 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

2 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago