రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతోంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంటర్లకు టికెట్లు కావాలంటు సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలకనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికివారుగా తమ కుటుంబసభ్యలకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ పెంచేస్తున్నారు.
ఇలాంటి లాబీయింగ్ లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మరికొందరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డంవివేక్ లాంటి వాళ్ళు కూడా రేసులో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ అంతకంతుకు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మూడునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాల్లో సానుకూలత ఉండటం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చింది.
100 రోజుల్లోనే సిక్స్ గ్యాంరెటీస్ అమల్లోకి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే అదంతా ఈజీకాదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఖజనా దాదాపు ఒట్టిపోయిన స్ధితిలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ముందు ఆదాయవనరులను పెంచుకోవటం, ఖర్చులు తగ్గించుకోవటం లాంటి వాటిపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది. దీనికి అదనంగా కేసీయార్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపైన కూడా దృష్టిపెట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి సాగునీటి ప్రాజెక్టుల గోల ఉండనే ఉంది.
ఇలాంటి పరిస్ధితుల్లో మొదటి వందరోజుల్లోనే నాలుగు హామీలను అమల్లోకి తేవటం గొప్ప విషయమనే చెప్పాలి. కాకపోతే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీస్ ను అమలుచేయలేకపోవటం ఫెయిల్యూరనే చెప్పాలి. అమలుచేయాల్సిన రెండు హామీలపై రేవంత్ క్లారిటి ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూలతైతే ఉంది. కష్టపడితే గెలిచిపోతామన్న నమ్మకం ఉండబట్టే టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిపోతోంది. మరి ఫ్యామిలీప్యాకుల గోల ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 12, 2024 1:31 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…