రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతోంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంటర్లకు టికెట్లు కావాలంటు సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలకనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికివారుగా తమ కుటుంబసభ్యలకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ పెంచేస్తున్నారు.
ఇలాంటి లాబీయింగ్ లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మరికొందరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డంవివేక్ లాంటి వాళ్ళు కూడా రేసులో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ అంతకంతుకు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మూడునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాల్లో సానుకూలత ఉండటం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చింది.
100 రోజుల్లోనే సిక్స్ గ్యాంరెటీస్ అమల్లోకి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే అదంతా ఈజీకాదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఖజనా దాదాపు ఒట్టిపోయిన స్ధితిలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ముందు ఆదాయవనరులను పెంచుకోవటం, ఖర్చులు తగ్గించుకోవటం లాంటి వాటిపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది. దీనికి అదనంగా కేసీయార్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపైన కూడా దృష్టిపెట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి సాగునీటి ప్రాజెక్టుల గోల ఉండనే ఉంది.
ఇలాంటి పరిస్ధితుల్లో మొదటి వందరోజుల్లోనే నాలుగు హామీలను అమల్లోకి తేవటం గొప్ప విషయమనే చెప్పాలి. కాకపోతే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీస్ ను అమలుచేయలేకపోవటం ఫెయిల్యూరనే చెప్పాలి. అమలుచేయాల్సిన రెండు హామీలపై రేవంత్ క్లారిటి ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూలతైతే ఉంది. కష్టపడితే గెలిచిపోతామన్న నమ్మకం ఉండబట్టే టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిపోతోంది. మరి ఫ్యామిలీప్యాకుల గోల ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 12, 2024 1:31 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…