రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన విరాళాల వివరాలను బయట పెట్టి తీరాల్సిం దేనని సుప్రీంకోర్టు మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు.. ఎంతెంత ఇచ్చారు? ఎవరెవరు దీనిని తీసుకున్నారు. వంటివివరాలను వెల్లడించాల్సిందే. దీనిలో మినహాయింపు లేదు అని తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఈ కేసును గత వారమే విచారించిన కోర్టు.. బాండ్ల వివరాలను వెల్లడించాలంటూ ఎస్బీఐని ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలన్న బ్యాంకు విన్నపాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే 26 రోజులు గడిచినా పూర్తి సమాచారం కోసం మరికొంత గడువు ఇవ్వాలని అడగడమేంటని నిలదీసింది. అలా అడగడం దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ నిజాయతీపై సందేహాలు వచ్చేలా చేస్తోందని, పరువు తీసుకోవద్దని వ్యాఖ్యానించింది.
జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. మార్చి 15 సా యంత్రం 5 గంటల్లోపు తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటు లో ఉంచాలని ఆదేశించింది. ఎస్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. “మాకు కొంత సమయం కావాలి. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా బాండ్లను జారీ చేయడాన్ని నిలిపే శాం. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు కాలేదు. బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉంది” అని పేర్కొన్నారు.
తమ వద్ద అందరి వివరాలూ ఉన్నాయని, అలాగే వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్న పార్టీల వివరాలు కూడా ఉన్నాయన్నారు. వీటిని వెల్లడించే హడావుడి, తొందరపాటులో తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే బ్యాంకు ఉద్దేశమని చెప్పారు. తీర్పును పరిశీలిస్తే.. బాండ్ల కొనుగోలుదారుల వివరాలతో పాటు వాటిని తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలు ఇవ్వాలని ఉందని, ఈ రెండింటిని జోడించకుండా వివరాలు ఇవ్వాలంటే 3 వారాల్లోగా ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ సిద్ధగా ఉందన్నారు.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…