Political News

ఎస్‌బీఐకి మైండ్ బ్లాక్ చేసిన సుప్రీంకోర్టు

రాజ‌కీయ పార్టీల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన విరాళాల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టి తీరాల్సిం దేన‌ని సుప్రీంకోర్టు మ‌రోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏ పార్టీకి ఎవ‌రు.. ఎంతెంత ఇచ్చారు? ఎవ‌రెవ‌రు దీనిని తీసుకున్నారు. వంటివివ‌రాల‌ను వెల్ల‌డించాల్సిందే. దీనిలో మిన‌హాయింపు లేదు అని తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు స‌భ్యుల బెంచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వాస్త‌వానికి ఈ కేసును గ‌త వార‌మే విచారించిన కోర్టు.. బాండ్ల వివ‌రాలను వెల్ల‌డించాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలన్న బ్యాంకు విన్న‌పాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. ఇప్ప‌టికే 26 రోజులు గడిచినా పూర్తి సమాచారం కోసం మరికొంత గడువు ఇవ్వాలని అడగడమేంటని నిల‌దీసింది. అలా అడగడం దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ నిజాయతీపై సందేహాలు వ‌చ్చేలా చేస్తోంద‌ని, పరువు తీసుకోవ‌ద్దని వ్యాఖ్యానించింది.

జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మార్చి 15 సా యంత్రం 5 గంటల్లోపు తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచాలని ఆదేశించింది. ఎస్‌బీఐ త‌ర‌ఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. “మాకు కొంత సమయం కావాలి. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా బాండ్లను జారీ చేయడాన్ని నిలిపే శాం. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు కాలేదు. బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉంది” అని పేర్కొన్నారు.

త‌మ‌ వద్ద అందరి వివరాలూ ఉన్నాయని, అలాగే వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్న పార్టీల వివరాలు కూడా ఉన్నాయన్నారు. వీటిని వెల్లడించే హడావుడి, తొందరపాటులో తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే బ్యాంకు ఉద్దేశ‌మ‌ని చెప్పారు. తీర్పును పరిశీలిస్తే.. బాండ్ల కొనుగోలుదారుల వివరాలతో పాటు వాటిని తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలు ఇవ్వాలని ఉందని, ఈ రెండింటిని జోడించకుండా వివరాలు ఇవ్వాలంటే 3 వారాల్లోగా ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ సిద్ధగా ఉందన్నారు.

This post was last modified on March 11, 2024 5:16 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

11 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago