Political News

ఎస్‌బీఐకి మైండ్ బ్లాక్ చేసిన సుప్రీంకోర్టు

రాజ‌కీయ పార్టీల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన విరాళాల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టి తీరాల్సిం దేన‌ని సుప్రీంకోర్టు మ‌రోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏ పార్టీకి ఎవ‌రు.. ఎంతెంత ఇచ్చారు? ఎవ‌రెవ‌రు దీనిని తీసుకున్నారు. వంటివివ‌రాల‌ను వెల్ల‌డించాల్సిందే. దీనిలో మిన‌హాయింపు లేదు అని తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు స‌భ్యుల బెంచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వాస్త‌వానికి ఈ కేసును గ‌త వార‌మే విచారించిన కోర్టు.. బాండ్ల వివ‌రాలను వెల్ల‌డించాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలన్న బ్యాంకు విన్న‌పాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. ఇప్ప‌టికే 26 రోజులు గడిచినా పూర్తి సమాచారం కోసం మరికొంత గడువు ఇవ్వాలని అడగడమేంటని నిల‌దీసింది. అలా అడగడం దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ నిజాయతీపై సందేహాలు వ‌చ్చేలా చేస్తోంద‌ని, పరువు తీసుకోవ‌ద్దని వ్యాఖ్యానించింది.

జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మార్చి 15 సా యంత్రం 5 గంటల్లోపు తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచాలని ఆదేశించింది. ఎస్‌బీఐ త‌ర‌ఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. “మాకు కొంత సమయం కావాలి. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా బాండ్లను జారీ చేయడాన్ని నిలిపే శాం. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు కాలేదు. బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉంది” అని పేర్కొన్నారు.

త‌మ‌ వద్ద అందరి వివరాలూ ఉన్నాయని, అలాగే వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్న పార్టీల వివరాలు కూడా ఉన్నాయన్నారు. వీటిని వెల్లడించే హడావుడి, తొందరపాటులో తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే బ్యాంకు ఉద్దేశ‌మ‌ని చెప్పారు. తీర్పును పరిశీలిస్తే.. బాండ్ల కొనుగోలుదారుల వివరాలతో పాటు వాటిని తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలు ఇవ్వాలని ఉందని, ఈ రెండింటిని జోడించకుండా వివరాలు ఇవ్వాలంటే 3 వారాల్లోగా ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ సిద్ధగా ఉందన్నారు.

This post was last modified on March 11, 2024 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

18 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

33 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago