Political News

కంగనా తల్లి ఆశా రనౌత్ కు బీజేపీ బంపరాఫర్

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని, తనకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కంగనా కోరిన వెంటనే కేంద్రం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇక, కంగనా ఆఫీసు కూల్చివేతపై గవరన్నర్ కోషియారీ ఏకంగా కేంద్రానికి నివేదిక పంపుతానని చెప్పారు. ఓ వైపు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని పీవోకేతో పోల్చిన కంగనా….ముంబై బ్రాండ్ ఇమేజ్ కు భంగం వాటిల్లుతున్నా బీజేపీ నేతలు నోరు మెదపలేదు. దీంతో, బీజేపీ ట్యూన్ కు కంగనా స్టెప్పులేస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ విమర్శలకు ఊతమిచ్చేలా కంగనా తల్లి ఆశా రనౌత్ కు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఆశా రనౌత్ కు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉంటే బీజేపీలో చేరవచ్చని హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ సురేష్‌కుమార్‌ కశ్యప్‌ చేసిన ప్రకటన ఇపుడు హాట్ టాపిక్ అయింది.

తన కూతురుకు వై ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించినందుకుగాను బీజేపీకి ఆశా రనౌత్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, హిమాచల్ ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు యోగక్షేమాలను పట్టించుకుంటున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇంతకు ముందు తాము కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులమే అయినా ఇప్పుడు బీజేపీ పట్ల అభిమానం పెరిగిందని ఆశా రనౌత్‌ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమెను బీజేపీలో చేరాల్సిందిగా హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ ఆహ్వానించింది. ఆల్రెడీ బీజేపీ మద్దతుదారు అయిన ఆశా రనౌత్‌ కు ఈ ఆఫర్ రావడంలో వింతేమీ లేదు. ఆశా రనౌత్‌తో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, ఆమెను బీజేపీలోకి ఆహ్వానించానని కశ్యప్ తెలిపారు. కంగనా పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, కంగనా వెనుకాల దేశం యావత్తు నిలుస్తుందని చెప్పారు.

This post was last modified on September 11, 2020 9:53 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

2 hours ago

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

3 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

4 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

4 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

5 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

6 hours ago