జ‌గ‌న్ స‌భ‌కు మీరు రావొద్దు: మీడియాకు నోటీసులు

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు సంబంధించిన స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. సిద్ధం పేరుతో ఇప్ప‌టికే విశాఖ‌, ఏలూరు, అనంత‌పురంలో మూడు స‌భ‌లు నిర్వ‌హించారు. తాజాగా బాప‌ట్ల జిల్లాలో ఆయ‌న స‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈ ‘సిద్ధం’ సభ కవరేజీకి రావొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఎవ‌రైనా మీడియాను ర‌మ్మ‌ని కోరుకుంటారు. అంతేకాదు.. మీడియా ప్ర‌తినిధులు వ‌చ్చే వ‌ర‌కు కూడా కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌ని నాయ‌కులు కూడా ఉన్నారు.

కానీ, చిత్రంగా జ‌గ‌న్‌స‌భ‌కు మాత్రం మీడియాను వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వీరికి నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. నోటీసులు తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు పోలీసులు ఫోన్లు చేసి మ‌రీ పిలిచిఇవ్వ‌డం విశేషం. సెక్ష‌న్ 149 కింద‌ నోటీసులు వచ్చాయని పోలీసులు తెలిపారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్‌ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.

కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సభను అడ్డుకుంటారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తూర్పుపాలెం రైతులకు సైతం నోటీసులు ఇచ్చారు. సిద్ధం సభ వైపు వెళ్లొద్దంటూ నలుగురు రైతులకు పోలీసుల నోటీసులను జారీ చేశారు.

ఇదే కార‌ణ‌మా?

గ‌త నెల‌లో అనంత‌పురంలో నిర్వ‌హించిన సిద్ధం 3వ స‌భ‌లో ఓ మీడియా ఫొటో గ్రాఫ‌ర్‌పై వైసీపీ కార్య‌క‌ర్త లు దాడి చేశారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఫొటో గ్రాఫ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది రాజ‌కీయ దుమారానికి కూడా దారి తీసింది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు సిద్ధం 4వ స‌భ‌కు మీడియాను నియంత్రించి ఉంటార‌ని చెబుతున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి లోగుట్టు ఏంట‌నేది వేచి చూడాలి.

This post was last modified on March 10, 2024 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

30 minutes ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

57 minutes ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

1 hour ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

1 hour ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

5 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

10 hours ago