వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధం పేరుతో ఇప్పటికే విశాఖ, ఏలూరు, అనంతపురంలో మూడు సభలు నిర్వహించారు. తాజాగా బాపట్ల జిల్లాలో ఆయన సభకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ ‘సిద్ధం’ సభ కవరేజీకి రావొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. వాస్తవానికి ఎవరైనా మీడియాను రమ్మని కోరుకుంటారు. అంతేకాదు.. మీడియా ప్రతినిధులు వచ్చే వరకు కూడా కార్యక్రమాలు ప్రారంభించని నాయకులు కూడా ఉన్నారు.
కానీ, చిత్రంగా జగన్సభకు మాత్రం మీడియాను వద్దని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వీరికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. నోటీసులు తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు పోలీసులు ఫోన్లు చేసి మరీ పిలిచిఇవ్వడం విశేషం. సెక్షన్ 149 కింద నోటీసులు వచ్చాయని పోలీసులు తెలిపారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.
కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సభను అడ్డుకుంటారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తూర్పుపాలెం రైతులకు సైతం నోటీసులు ఇచ్చారు. సిద్ధం సభ వైపు వెళ్లొద్దంటూ నలుగురు రైతులకు పోలీసుల నోటీసులను జారీ చేశారు.
ఇదే కారణమా?
గత నెలలో అనంతపురంలో నిర్వహించిన సిద్ధం 3వ సభలో ఓ మీడియా ఫొటో గ్రాఫర్పై వైసీపీ కార్యకర్త లు దాడి చేశారు. ఈ క్రమంలో సదరు ఫొటో గ్రాఫర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇది రాజకీయ దుమారానికి కూడా దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిద్ధం 4వ సభకు మీడియాను నియంత్రించి ఉంటారని చెబుతున్నారు వైసీపీ నాయకులు. మరి లోగుట్టు ఏంటనేది వేచి చూడాలి.
This post was last modified on March 10, 2024 1:59 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…