జ‌గ‌న్ స‌భ‌కు మీరు రావొద్దు: మీడియాకు నోటీసులు

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు సంబంధించిన స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. సిద్ధం పేరుతో ఇప్ప‌టికే విశాఖ‌, ఏలూరు, అనంత‌పురంలో మూడు స‌భ‌లు నిర్వ‌హించారు. తాజాగా బాప‌ట్ల జిల్లాలో ఆయ‌న స‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈ ‘సిద్ధం’ సభ కవరేజీకి రావొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఎవ‌రైనా మీడియాను ర‌మ్మ‌ని కోరుకుంటారు. అంతేకాదు.. మీడియా ప్ర‌తినిధులు వ‌చ్చే వ‌ర‌కు కూడా కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌ని నాయ‌కులు కూడా ఉన్నారు.

కానీ, చిత్రంగా జ‌గ‌న్‌స‌భ‌కు మాత్రం మీడియాను వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వీరికి నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. నోటీసులు తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు పోలీసులు ఫోన్లు చేసి మ‌రీ పిలిచిఇవ్వ‌డం విశేషం. సెక్ష‌న్ 149 కింద‌ నోటీసులు వచ్చాయని పోలీసులు తెలిపారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్‌ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.

కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సభను అడ్డుకుంటారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తూర్పుపాలెం రైతులకు సైతం నోటీసులు ఇచ్చారు. సిద్ధం సభ వైపు వెళ్లొద్దంటూ నలుగురు రైతులకు పోలీసుల నోటీసులను జారీ చేశారు.

ఇదే కార‌ణ‌మా?

గ‌త నెల‌లో అనంత‌పురంలో నిర్వ‌హించిన సిద్ధం 3వ స‌భ‌లో ఓ మీడియా ఫొటో గ్రాఫ‌ర్‌పై వైసీపీ కార్య‌క‌ర్త లు దాడి చేశారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఫొటో గ్రాఫ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది రాజ‌కీయ దుమారానికి కూడా దారి తీసింది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు సిద్ధం 4వ స‌భ‌కు మీడియాను నియంత్రించి ఉంటార‌ని చెబుతున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి లోగుట్టు ఏంట‌నేది వేచి చూడాలి.

This post was last modified on March 10, 2024 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago