Political News

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక రాజీనామా

భారత ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024కు కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది.

2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఇప్పుడు కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అరుణ్‌ గోయల్‌‌ 2022 నవంబర్ లో నియమితులయ్యారు. 1985 పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. వాస్తవానికి ఆయన నియామకానికి 6 నెలల నుంచి ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్ 19న అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే కొంతకాలం కిందటే రిటైర్ కావడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. మరోవైపు 2027 వరకు పదీకాలం ఉన్నప్పటికీ మరో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం గ‌మ‌నార్హం.

రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదించడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఎన్నికల కమిషనర్లను నియమించనుందని తెలుస్తోంది. అయితే.. పంజాబ్ నుంచి ఎంపీ స్థానానికి గోయ‌ల్ పోటీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అది కూడా బీజేపీ నుంచేన‌ని తెలుస్తోంది.

This post was last modified on March 10, 2024 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago