ఏపీ రాజధానులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార వికేంద్రీకరణ.. అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చేసేందుకు వీలుగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్షం తీవ్రంగా తప్పు పడుతోంది. ఇలాంటివేళ..మేధావి వర్గానికి చెందిన లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక టీవీ చానల్ లో జరిగే చర్చకు హాజరైన ఆయన.. ఏపీ రాష్ట్రం పేరు నేరుగా ప్రస్తావించకుండా.. మూడు రాజధానుల అంశాల్ని ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేమన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించే స్వేచ్ఛ ఉంటుందన్న ఆయన.. మంచి చెడులను పక్కన పెట్టేయాలన్నారు.
ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి ఓటువేసి ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధమైన నిర్నయం తీసుకుంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. అదే సమయంలో మీరు ఇలా చేయకూడదనే మాట చెప్పటానికి కోర్టులకు కానీ మరొకరికి కానీ ఉండదన్నారు.
ప్రభుత్వాలు.. కోర్టులు.. చట్టసభలు తమ తమ పాత్రలు పోషించాలని.. దేశంలో పలు సందర్భాల్లో కలగాపులగం అయిపోతుందన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వంలా.. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కోర్టుల్లా వ్యవహరిస్తుంటాయన్నారు. మూడు ప్రాంతాల్లో మూడురాజధానులపై ఏర్పాటు అంశాన్ని జేపీ సమర్థించటం చూస్తే.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం కలుగక మానదు.
This post was last modified on September 11, 2020 2:25 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…