Political News

మోడీ ప్ర‌సంగాల‌కు ‘ఏఐ’ మెరుపులు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌సంగాల‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలెన్స్‌(ఏఐ)తో మెరుపులు మెరిపించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌క్షిణాది రాష్ట్రాలే కేంద్రంగా ఈ ప్ర‌యోగానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. వాస్త‌వానికి ఏఐ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సందేహాలు, అను మానాలు.. విమ‌ర్శ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఏఐతో మంచి ప‌నులు కూడా చేయొచ్చ‌నేది నిర్ధార‌ణ అయిన అంశమే తాజాగా ఒత్తిడిని గుర్తించే ఏఐ టూల్ అందుబాటులోకి వ‌చ్చింది. అదేవిధంగా ఏఐని వినియోగించి బ్యాంకు లావాదేవీల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండే టూల్స్ కూడా అందుబాటులోకి వ‌చ్చాయి.

సో.. ఏఐ అనేది మ‌నం వినియోగించుకునే విధానాన్ని బ‌ట్టే ఆధార‌ప‌డి ఉంటుంద‌నేది స్ప‌ష్ట‌మైంది. ఇప్పుడు తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యంలో బీజేపీ ఏఐపై క‌న్నేసింది. ఏఐని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన ప్ర‌సంగాల‌ను అప్ప‌టిక‌ప్పుడే.. స్థానిక భాష‌ల్లో అనువించ‌నున్నారు. అంటే.. వేరే ఎవ‌రూ అనువ‌దించిన‌ట్టుగా ఉండ‌దు.. స్క్రీన్‌పై ప్ర‌ధాని స్వ‌చ్ఛంగా స‌ద‌రు స్థానిక భాష‌లోనే మాట్లాడిన‌ట్టుగా ఏఐ స‌ద‌రు ప్ర‌సంగాల‌ను త‌ర్జుమా చేస్తుంది. ఎక్క‌డా చిన్న లోపం లేకుండా.. స‌ద‌రు ప్రాంతీయ భాష‌లో ఎలాంటి ఉచ్ఛార‌ణ లోపాలు రాకుండాకూడా ఏఐ అప్ర‌మత్తంగా ఉంటుంది.

ఏంటి లాభం?

ప్ర‌స్తుతం బీజేపీకి ఉత్త‌రాదిన మంచి ప్ర‌భావ‌మే ఉంది. దీనికి కార‌ణం మాట‌ల మాంత్రికుడుగా ప్ర‌ధాని మోడీ పేరు తెచ్చుకోవ‌డ‌మే. ఆయ‌న చెప్పే హిందీ ప్ర‌సంగాలు ఉత్త‌రాది వారిని అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. త‌ద్వారా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా చేరువ‌య్యారు. అదే ద‌క్షిణాదిని తీసుకుంటే.. భాషా ప‌ర‌మైన ఇబ్బంది.. ప్ర‌ధాని మోడీకి-ద‌క్షిణాదిలోని ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు త‌ట‌స్థంగా ఉంచింది.

ఆయ‌న ఎక్క‌డైనా ప్ర‌సంగాలు చేసినా.. వాటిని ఇత‌ర నేత‌లు త‌ర్జుమా చేసినా.. మ‌క్కీకి మ‌క్కీ.. మోడీ చెప్పిన‌ట్టు.. మ‌న‌సును హ‌త్తుకునేట్టు ఉండ‌వు. దీంతో ఓటు బ్యాంకు బీజేపీకి చేరువ కాలేక పోతోంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏఐ సాయంతో మోడీ ప్ర‌సంగాల‌ను త‌క్ష‌ణం స్థానిక భాష‌ల్లోకి త‌ర్జుమా చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని క‌మ‌ల నాథులు ప్లాన్ చేశారు. ఇదీ.. సంగతి!!

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

5 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

5 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

7 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

7 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

7 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

7 hours ago