Political News

రేవంత్ హవా.. కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు: స‌ర్వ‌ే

రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ మ‌రోసారి విజ‌య దుందుభి మోగిస్తుంద‌ని తాజాగా ఓ స‌ర్వే చాటి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని స‌ర్వే తెలిపింది. అదేవిధంగా ప్ర‌జాపాల‌న దిశ‌గా సీఎం రేవంత్ వేస్తున్న అడుగులు గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను మెరిపిస్తున్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 17 స్థానాల‌కు గాను కాంగ్రెస్ పార్టీ 9నుంచి 10 స్థానాల్లో ఖ‌చ్చితంగా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

తాజాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో ‘ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్’ స‌ర్వే చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా అత్యధికంగా 9 నుంచి 10 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలవనుందని అంచ‌నావేసింది. దీనికి ప్ర‌ధానంగా రేవంత్ హ‌వానే కార‌ణ‌మ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా మ‌హిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంద‌ని పేర్కొంది. ఇక‌, ఇత‌ర ప‌థ‌కాలు, విద్యార్థులు, డీఎస్సీ వంటివి ఫ‌లిస్తున్నాయ‌ని తెలిపింది.

ఇక‌, పాగా వేస్తామ‌ని చెబుతున్న‌ బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో 5 చోట్ల విజయం సాధిస్తుందని స‌ర్వే విశ్లేషించింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనికి బండి సంజ‌య్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల హ‌వా క‌నిపిస్తున్న‌ట్టు స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితం కానుందని మ‌రో సంచ‌ల‌న అంచనా వెల్ల‌డించింది.

మైనారిటీ నాయ‌కుడు, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ సారధ్యంలోని ఏఐఎంఐఎం పార్టీ ఒక సీటులో విజయం సాధిస్తుందని స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అది కూడా హైదరాబాద్ స్థానాన్నిమరోసారి ద‌క్కించుకుంటుంద‌ని తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికలు-2019లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)- 9 సీట్లు, బీజేపీ – 4, కాంగ్రెస్ -3, ఏఐఎంఐఎం -1 సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి ఎన్నిక‌ల్లో ఈ ఫ‌లితాలు రివ‌ర్స్ కానున్నాయ‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

Satya

Recent Posts

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

50 minutes ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

2 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

4 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

4 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

5 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

5 hours ago