బీఆర్ఎస్ కు ఒక ఎంఎల్ఏ షాకిచ్చినట్లేనా ? ఇపుడిదే అంశంపై పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కేసీయార్, కేటీయార్ ఆధ్వర్యంలో జరిగిన రెండు సమావేశాలకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు హాజరుకాలేదు. బీఆర్ఎస్ మీటింగులకు తెల్లం హాజరుకాకపోగా మధ్యలో రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో తెల్లం తొందరలోనే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. తెల్లం మాత్రం తాను నియోజకవర్గం డెవలెప్మెంట్ కు నిధుల అడిగేందుకు మాత్రమే కలిశానని చెబుతున్నారు.
ముఖ్యమంత్రిని ఎవరు ఎందుకు కలిసినా చెప్పేది మాత్రం ముందు నియోజకవర్గం అభివృద్ది కోసమనే చెబుతారు. తర్వాత జరిగే డెవలప్మెంట్లలోనే సడెన్ గా పార్టీ మారిపోతారు. ఈ విషయాన్ని జనాలు గడచిన పదేళ్ళుగా చాలాసార్లు చూశారు. ఇక్కడ విషయం విషయం ఏమిటంటే తెల్లం వెకటరావు మొదటినుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కీలక మద్దతుదారుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలంలో పోటీచేసేందుకు తెల్లంకు పొంగులేటి కోటాలో టికెట్ రాలేదు.
దాంతో చివరి నిముషంలో తెల్లం బీఆర్ఎస్ అగ్రనేతలతో మాట్లాడుకుని కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి దూకేశారు. టికెట్ తెచ్చుకోవటమే కాకుండా గెలిచారు కూడా. విచిత్రం ఏమిటంటే ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రచారంచేసిన కేసీయార్ ఒక్క భద్రాచలంలో మాత్రం ప్రచారం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రచారం చేసినా టైం వేస్తు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని అనుకున్నారట. అంటే భద్రాచలంలో ఎటూ బీఆర్ఎస్ గెలవదు కాబట్టి ప్రచారంకు సమయం కేటాయించటం కూడా వృధానే అనుకున్నారట.
అయితే ఖమ్మం జిల్లాలో కేసీయార్ ప్రచారం చేసిన తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులు ఓడిపోయారు. ప్రచారం అనవసరమని కేసీయార్ వదిలేసిన భద్రాచలంలో మాత్రమే పార్టీ అభ్యర్ధి తెల్లం గెలిచారు. అప్పటినుండి తెల్లం ఏదోరోజు కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమని అందరు అనుకుంటునే ఉన్నారు. ఎందుకంటే మంత్రి పొంగులేటికి తెల్లం ప్రధాన మద్దతుదారుడు కావటమే. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ రెండు మీటింగులకు తెల్లం గైర్హాజరవ్వటం, ఇదే సమయంలో రేవంత్ రెడ్డితో భేటీ కావటంతో అందరిలోను తెల్లంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 5, 2024 11:14 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…