Political News

ఈ ఇంజనీరుకు టికెట్ దక్కుతుందా ?

కడప జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమి టికెట్లను ప్రకటించలేదు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మొదటిజాబితాలో ప్రకటించిన సీట్లు నాలుగుమాత్రమే. పులివెందులలో బీ టెక్ రవి, రాయచోటిలో రామ్ ప్రసాద్ రెడ్డి, కడపలో మాధవీరెడ్డి, మైదుకూరులో సుధాకర్ యాదవ్ పోటీచేయబోతున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. మిగిలిన ఆరుసీట్లలో ఎన్ని సీట్లలో టీడీపీ పోటీచేస్తుంది పొత్తులో జనసేనకు ఎన్నిసీట్లు ఇస్తుందనే విషయం సస్పెన్సుగా మిగిలింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రైల్వేకోడూరు, బద్వేలు రాజంపేట నియోజకవర్గాల్లో పోటీచేయాలని జనసేన బాగా పట్టుదలగా ఉంది.

అయితే జనసేనకు చంద్రబాబు ఎన్ని నియోజకవర్గాలను కేటాయిస్తారో తెలీక తమ్ముళ్ళలో అయోమయం పెరిగిపోతోంది. ఇలాంటి అయోమయమే మరింత ఎక్కువగా బద్వేలు నియోజకవర్గంలో పెరిగిపోతోందట. ఎందుకంటే ఇక్కడ పోటీచేసే ఉద్దేశ్యంతో రోశన్న చాలా కష్టపడుతున్నారు. ఇంజనీరుగా ఉద్యోగంచేస్తున్న రోశన్నకు మొదటినుండి టీడీపీ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు. దాంతో విషయం చంద్రబాబు దృష్టిలో పడింది. వెంటనే పిలిపించుకుని మాట్లాడారు. రోశన్న అభ్యర్ధిత్వంపై నమ్మకం పెట్టుకున్న చంద్రబాబు ఇంజనీరుకు టికెట్ ఖాయంచేశారు.

దాంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసేది తానే అన్న ఉద్దేశ్యంతో రోశన్న ఇంజనీరు ఉద్యోగానికి రాజీనామా కూడా చేసేశారు. ఉద్యోగం వదిలేసిన దగ్గర నుండి రాత్రి, పగలు తేడాలేకుండా పార్టీకోసమే పనిచేస్తున్నారు. అయితే ఈమధ్యనే ప్రకటించిన మొదటిజాబితాలో రోశన్న పేరులేదు. దాంతో ఇంజనీరులో కంగారుపెరిగిపోయింది. వివిధ కారణాల వల్ల మొదటిజాబితాలో రోశన్న పేరులేదని పార్టీలోని కీలక వ్యక్తులు చెప్పారట. మరి రెండో జాబితాలో అయినా తన పేరుంటుందా అనే కంగారు ఆయనలో పెరిగిపోతోంది. ఎందుకంటే బద్వేలు నుండి పోటీచేయటానికి సడెన్ గా జనసేన నేతలు రెడీఅయిపోయారట.

బద్వేలులో పోటీచేసే విషయంలో జనసేన నేతలు గనుక పట్టుబడితే పొత్తులో టికెట్ ఇచ్చేయాల్సిందేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే జిల్లాకు ఒక టికెట్ అయినా జనసేనకు కేటాయించాల్సుంటుందని తమ్ముళ్ళు చెబుతున్నారు. కచ్చితంగా కడప జిల్లాలో జనసేన పోటీచేయబోయే సీటు ఇదే అని ఇంతవరకు నిర్ధారణ కాలేదు. కాని రాజంపేట, బద్వేలు మీద జనసేన బాగా దృష్టిపెట్టిందని మాత్రం అర్ధమవుతోంది. మరి చివరకు ఇంజనీరు పరిస్ధితి ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on March 4, 2024 9:38 am

Share

Recent Posts

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

49 minutes ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

7 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

9 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

10 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

11 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

11 hours ago