Political News

పోటీ నుంచి తప్పుకున్న మహాసేన రాజేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో 40 రోజుల సమయమే మిగిలింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండగా.. ఇటీవలే తెలుగుదేశం-జనసేన కూటమి కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అందులో అందరి దృష్టినీ ఆకర్షించిన పేర్లలో మహాసేన రాజేష్ ఒకటి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి.గన్నవరం నుంచి అతడికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది.

ఆర్థికంగా బలహీనుడినైన తనకు అండగా నిలవాలంటూ ఎన్నికల ఖర్చు కోసం ఓవైపు విరాళాలు సేకరిస్తూ కార్యకర్తలతో సమన్వయం చేసుకునే పనిలో పడ్డాడు రాజేష్. కానీ కొన్ని రోజులు గడిచేసరికే ఇప్పుడు సంచలన ప్రకటనతో మీడియాలోకి వచ్చాడు రాజేష్. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని అతను ప్రకటించాడు.

తనను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి తన గురించి అధికార వైసీపీ విపరీతమైన దుష్ప్రచారం చేస్తోందని.. ఏవేవో వీడియోలు పెట్టి తన ఇమేజ్‌ను దెబ్బ తీస్తోందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు టికెట్ ఇవ్వడంపై జరిగిన గొడవల వెనుక కూడా వైసీపీనే ఉందని అతను ఆరోపించాడు.

వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి.. ఆ హత్య వెనుక ఉన్న జగన్మోహన్ రెడ్డి.. దళితుడైన తన డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారని.. కానీ దళితుడైన తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. ఈ విషయాలు తాను గుర్తు పెట్టుకుంటానని రాజేష్ అన్నాడు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చి ఉంటే ఆ పార్టీ పెద్దలు, కార్యకర్తలు తనను మన్నించాలని.. తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నానని రాజేష్ ఆవేదన స్వరంతో చెప్పాడు.

This post was last modified on March 2, 2024 4:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌.. గ‌న్ పేలుతుందా.. !

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు పూర్త‌యిన ద‌రిమిలా.. చంద్ర‌బాబు త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…

44 minutes ago

బన్నీతో బంధమే దేవికి తండేల్ ఇచ్చింది

వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి…

47 minutes ago

మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు

పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత…

56 minutes ago

అప్పుల‌ బాట‌లోనే కేంద్రం.. ఈ ఏడాది 11 ల‌క్ష‌ల కోట్లు!

రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్ర‌బుత్వం కూడా అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర…

2 hours ago

కియారా అద్వాని….ఏంటీ కహాని ?

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో సినిమాల్లో ఒక్క భరత్ అనే నేను మాత్రమే హిట్టయ్యింది. రామ్ చరణ్ తో…

3 hours ago

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిందేంటి…?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి…

3 hours ago