Political News

ఇవే చివ‌రి ఎన్నిక‌లు.. వైసీపీ యువ నేత

వైసీపీ యువ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రెండో కుమారుడు మిథున్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం రాత్రి రాజంపేట‌లో నిర్వ‌హించిన వైసీపీ నేత‌ల ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని వ్యాఖ్యానించారు. తాను రెండు సార్లు రాజంపేట ఎంపీగా విజ‌యం ద‌క్కించుకోవ‌డంలో నాయ‌కులు, కార్య‌కర్త‌లు ఎంతో శ్ర‌మించార‌ని.. వారిని తాను మ‌రిచిపోలేన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని అన్నారు.

“రాజంపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌చ్చాను. అనేక ప‌నులు చేయించాను. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయాను. ఈ సారి ఇదే నాకు చివ‌రి ఎన్నిక‌లు. అయితే.. రాజ‌కీయా ల‌కు దూరంగా మాత్రం ఉండ‌ను. మీ అంద‌రి ఆశీర్వాదంతో ఈ సారి గెలుస్తాన‌ని న‌మ్ముతున్నాను” అని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై వైసీపీ నాయ‌కులు, టీడీపీ నేత‌లు డిఫ‌రెంట్ టోన్ వ్య‌క్త ప‌రిచారు. తాను ఓడిపోతాన‌ని తెలిసే.. ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించార‌ని టీడీపీ నాయ‌కులు చెప్పారు.

అయితే.. వైసీపీ నాయ‌కులు మాత్రం వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లో ఆయ‌న రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ని.. ఎంపీ ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే విరామం ఇస్తున్నార‌ని చెప్పారు. అయితే.. ఈ విష‌యంలో మిథున్‌రెడ్డి మాత్రం క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. 2014, 2019లో రాజంపేట ఎంపీ స్తానం నుంచి మిథున్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు.

2014లో టీడీపీ-బీజేపీ పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో అతి క‌ష్టం మీద మిథున్‌రెడ్డి వైసీపీ త‌ర‌ఫున తొలిసారివిజ‌యంఅందుకున్నారు. ఇక‌, 2019లో టీడీపీ త‌ర‌ఫున డీకే స‌త్యప్ర‌భ‌(ఆదికేశ‌వుల నాయుడు స‌తీమ‌ణి) టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం సునాయాసంగా మిథున్‌రెడ్డి రెండో సారి విజ‌యం సాధించారు. అయితే.. ఈ సారి మాత్రం టీడీపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. దీనిని బీజేపీ కోరుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం ఉంది.

This post was last modified on March 1, 2024 10:08 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

30 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

2 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago