Political News

ఇక‌, తాయిలాల స‌మ‌యం.. వైసీపీనే ఫస్ట్‌

ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీల నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా త‌మ‌కు ఓటేస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారికి తాయిలాలు పంచ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌లు చోట్ల ఓట‌ర్లు రోడ్డెక్కి మ‌రీ వీటిని ద‌క్కించుకున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు ఏపీ వంతు వ‌చ్చింది. ఇక్క‌డ ఇంకా ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా అభ్య‌ర్థులుతాయిలాల పంపిణీలో అప్పుడే ప్రారంభించ‌శారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఒక‌నియోజ‌క‌వ‌ర్గం వారిని వేరే నియోజ‌క‌వ‌ర్గంలో నియ‌మించ‌డ‌మే.

దీంతో వారు.. త‌మ గురించి తెలియ‌ని ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్రమంలో చిన్న, పెద్ద నేతలు చేతిలో చీర, కుక్కర్లు, వాచీలాంటి ఏదో ఓ ఉపకరణంతో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. రాత్రిళ్లు ఇంటింటికీ తలుపుకొట్టి మరీ తాయిలాలు పంచుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుచరులు, వైసీపీ నాయకులు చీకటి పడగానే ఆయా గ్రామాల్లో వాలంటీర్లను వెంటేసుకొని కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు.

ఇటీవల ఎమ్మెల్యే సతీమణి వ‌లంటీర్లతో సమావేశమై సూచనలిచ్చారు. కుక్కర్‌ బాక్స్‌పై ‘ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సీఎం జగన్‌, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌’ అనే స్టిక్కరు వేసి మరీ ఓటేయాల్సిన గుర్తును గుర్తుచేస్తున్నారు. పార్వతీపు రం మన్యం జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఈ నెల 3న సీతానగరం మండలం పణుకుపేటలో మహిళకు చీర, రూ.500 ఇచ్చారు. గ్రామస్థాయి నాయకులు అప్పట్నుంచి రోజూ కొన్ని గ్రామాలు ఎంచుకొని పంపకాలు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో కొందరికే నగదు బహుమతులు అందాయని మిగిలిన వారికి వాచీలు అందజేశారు. వీటిని పంచాయతీ కార్యాలయాల్లోనే వైసీపీ సర్పంచులు బాహాటంగా అందజేయడం గమనార్హం. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌గా కొత్త‌గా నియ‌మితులైన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కూడా.. వ‌లంటీర్ల‌కు ముందుగా కుక్క‌ర్లు, కొంత న‌గ‌దు(అవ‌స‌ర‌మైన వారికి) ఇచ్చి ఆక‌ట్టుకున్నారు. ఇక‌, టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వారిని ఆక‌ట్టుకునేందుకు చీర‌లు, వెండి వ‌స్తువులు పంపిణీ చేయ‌డం గ‌మ‌నార్హం.ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ లేక‌పోవ‌డంతో ఎవ‌రూ వీరిని అడ్డుకోలేని ప‌రిస్థితి ఉండడం క‌లిసి వ‌స్తోంద‌ని నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on March 1, 2024 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago