Political News

కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ?

తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రు. 55 కోట్ల దుర్వినియోగం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపైన రెరా బాలకృష్ణ కేసులో తగులుకున్నారు. రెరా డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన నిర్మాణ సంస్ధల నుండి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను అర్వింద్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ చేయడానికి ఏసీబీ రెడీ అయ్యింది. ప్రభుత్వం అనుమతితో నోటీసులు ఇవ్వటానికి కాచుక్కూర్చున్నది.

ఏ సంస్ధ నుండి అర్వింద్ ఎంతెంత డబ్బులు తీసుకున్నారన్న విషయం బాలకృష్ణ విచారణలో చెప్పేశారట. అలాగే ఆయన డైరీల్లో కూడా ముడుపుల వివరాలున్నట్లు సమాచారం. ఈ రెండు విషయాలు ఇలాగుండగానే తాజాగా ఔటర్ రింగ్ రోడ్డులో అధికార దుర్వినియోగం కూడా ఇపుడు అర్వింద్ మీదపడింది. ఓఆర్ఆర్ వ్యవహారంలో అధికార దుర్వినియోగం, అవినీతి విషయాలను బయటకు తీయటంలో భాగంగా బాధ్యులందరిపైనా కేసులు పెట్టి విచారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఓఆర్ఆర్ నిర్వహణను అక్రమంగా మహారాష్ట్రకు చెందిన సంస్ధకు కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు పదేపదే ఆరోపించింది. హెచ్ఎండీఏ కార్యదర్శిగా వ్యవహరించిన అర్విందే అప్పటి ఓఆర్ఆర్ లీజు వ్యవహారాన్ని కూడా పర్యవేక్షించారు. పారదర్శకంగా టెండర్లు పిలవకుండానే తమకిష్టమైన సంస్ధకు టెండర్ ఇచ్చేసిందని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంతే చాలా ఆరోపణలు చేశారు. అయితే అప్పటి మంత్రి కేటీయార్ తో పాటు అర్వింద్ కూడా తమ చర్యలను సమర్ధించుకున్నారు.

పైగా రేవంత్ ఆరోపణలన్నీ తప్పంటు అప్పట్లో అర్వింద్ మీడియా సమావేశం పెట్టి రెచ్చిపోయారు. లీజు వివరాలను ఇవ్వాలని రేవంత్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తే వివరాలు ఇవ్వటానికి అర్వింద్ తిరస్కరించారు. దీనిపై రేవంత్ కోర్టులో కేసు వేస్తే అర్వింద్ ను జడ్జి బాగా చివాట్లు పెట్టారు. అయినా వివరాలు ఇవ్వటానికి అర్వింద్ ఇష్టపడలేదు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తాజా పరిణామాల్లో అర్వింద్ పూర్తిగా కూరుకుపోతున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం టార్గెట్ అర్వింద్ కాకపోవచ్చు అప్పటి మంత్రి కేటీయారే అయ్యుండచ్చు. కాని డైరెక్టుగా తగులుకుంటున్నది మాత్రం అర్విందే.

This post was last modified on February 29, 2024 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

59 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago