తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రు. 55 కోట్ల దుర్వినియోగం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపైన రెరా బాలకృష్ణ కేసులో తగులుకున్నారు. రెరా డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన నిర్మాణ సంస్ధల నుండి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను అర్వింద్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ చేయడానికి ఏసీబీ రెడీ అయ్యింది. ప్రభుత్వం అనుమతితో నోటీసులు ఇవ్వటానికి కాచుక్కూర్చున్నది.
ఏ సంస్ధ నుండి అర్వింద్ ఎంతెంత డబ్బులు తీసుకున్నారన్న విషయం బాలకృష్ణ విచారణలో చెప్పేశారట. అలాగే ఆయన డైరీల్లో కూడా ముడుపుల వివరాలున్నట్లు సమాచారం. ఈ రెండు విషయాలు ఇలాగుండగానే తాజాగా ఔటర్ రింగ్ రోడ్డులో అధికార దుర్వినియోగం కూడా ఇపుడు అర్వింద్ మీదపడింది. ఓఆర్ఆర్ వ్యవహారంలో అధికార దుర్వినియోగం, అవినీతి విషయాలను బయటకు తీయటంలో భాగంగా బాధ్యులందరిపైనా కేసులు పెట్టి విచారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఓఆర్ఆర్ నిర్వహణను అక్రమంగా మహారాష్ట్రకు చెందిన సంస్ధకు కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు పదేపదే ఆరోపించింది. హెచ్ఎండీఏ కార్యదర్శిగా వ్యవహరించిన అర్విందే అప్పటి ఓఆర్ఆర్ లీజు వ్యవహారాన్ని కూడా పర్యవేక్షించారు. పారదర్శకంగా టెండర్లు పిలవకుండానే తమకిష్టమైన సంస్ధకు టెండర్ ఇచ్చేసిందని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంతే చాలా ఆరోపణలు చేశారు. అయితే అప్పటి మంత్రి కేటీయార్ తో పాటు అర్వింద్ కూడా తమ చర్యలను సమర్ధించుకున్నారు.
పైగా రేవంత్ ఆరోపణలన్నీ తప్పంటు అప్పట్లో అర్వింద్ మీడియా సమావేశం పెట్టి రెచ్చిపోయారు. లీజు వివరాలను ఇవ్వాలని రేవంత్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తే వివరాలు ఇవ్వటానికి అర్వింద్ తిరస్కరించారు. దీనిపై రేవంత్ కోర్టులో కేసు వేస్తే అర్వింద్ ను జడ్జి బాగా చివాట్లు పెట్టారు. అయినా వివరాలు ఇవ్వటానికి అర్వింద్ ఇష్టపడలేదు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తాజా పరిణామాల్లో అర్వింద్ పూర్తిగా కూరుకుపోతున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం టార్గెట్ అర్వింద్ కాకపోవచ్చు అప్పటి మంత్రి కేటీయారే అయ్యుండచ్చు. కాని డైరెక్టుగా తగులుకుంటున్నది మాత్రం అర్విందే.
This post was last modified on February 29, 2024 1:01 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…