తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈరోజు మొదటి జాబితాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈvమధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఈరోజు తెలంగాణా మొదటిజాబితా ప్రకటనపైన అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. తెలంగాణాలోని 17 స్ధానాల్లో మొదటి జాబితాలో ఎన్నిvసీట్లలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. పార్టీvవర్గాల సమాచారం ప్రకారం ఆరు నియోజకవర్గాలకు మొదటి లిస్టులో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందట.
అయితే ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాలే ఉంటాయని తెలిసింది. నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, కరీంనగర్లో బండి సంజయ్, సికింద్రాబాద్ లో కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్లుంటాయని సమాచారం. ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావుకు టికెట్ విషయంలో క్లారిటి రావటంలేదు. పై ముగ్గురి పేర్లు కాకుండా అదనంగా ముగ్గురి పేర్లను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అయితే అన్నీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఫైనల్ చేసేశారట. కాని మొదటిజాబితా పేరుతో ఆరుగురిని మాత్రమే ప్రకటించాలని నిర్ణయించారట.
అదనంగా ప్రకటిస్తారని అనుకుంటున్న ముగ్గురిలో మల్కాజ్ గిరి స్ధానంలో ఈటల రాజేందర్, చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరిలో డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, నాగర్ కర్నూలులో పీ రాములు ఉండచ్చని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 17 సీట్లలో కనీసం పది నియోజకవర్గాల్లో గెలవాలన్నది బీజేపీ టార్గెట్. అందుకనే రకరకాలుగా పరిశీలనలు జరిపి దరఖాస్తులను వడబోసి అభ్యర్ధులను ఎంపికచేస్తోంది.
మొదటిజాబితాలో ఆరుగురి పేర్లను మాత్రమే ఎందుకు ప్రకటిస్తోందంటే బీఆర్ఎస్ నుండి కొందరు ప్రజాప్రతినిధులు చేరబోతున్నారట. బీఆర్ఎస్ నుండి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఆరుగురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరే అవకాశముందని పార్టీనేతలు చెప్పారు. వీరు గనుక వస్తే అప్పుడు తాజా పరిస్ధితులను సమీక్షించి, నియోజకవర్గాల్లోని సీనియర్లతో చర్చించి అప్పుడు అభ్యర్ధులను ఎంపికచేసే ఆలోచనలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు లోకల్ నేతల సమాచారం. మరి వాళ్ళెపుడు చేరుతారు ? అగ్రనేతలు అభ్యర్ధులను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సిందే.
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…