Political News

వైసీపీ ‘సిద్ధం’ స‌భ వాయిదా.. రీజ‌నేంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్వ‌హిస్తున్న సిద్ధం స‌భ‌ల గురించి తెలిసిందే. ఇప్ప‌టి కి 3 సిద్దం స‌భ‌లు నిర్వ‌హించారు. ఇప్పుడు నాలుగో స‌భ‌ను ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అనూహ్యంగా ఈ స‌భ‌ను వాయిదా వేశారు. వాస్త‌వానికి ఏర్పాట్లు కూడా చేసుకు న్న త‌ర్వాత‌.. ఈ స‌భ వాయిదా ప‌డ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల్లో పొత్త‌లేన‌ని తెలుస్తోంది. మంగ‌ళ‌వారం రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో అలెర్ట్ అయిన‌.. జ‌గ‌న్‌.. ఢిల్లీకి వెళ్తున్నార‌ని తెలుస్తోంది. ప్రధాని మోడీ అపాయింట్ మెం ట్ కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల‌లో ఇప్ప‌టికే ఒక‌సారి ప్ర‌ధాని మోడీని క‌లిసి వ‌చ్చారు సీఎం జ‌గ‌న్‌. అప్పట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తర్వాత బీజేపీతో పొత్తుల అంశంపై ఏపీలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

కానీ, ఇప్పుడు మ‌రోసారి టీడీపీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంత‌లోనే టీడీపీ-జ‌నసేన సంయుక్తంగా తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో ఎంపీ అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. దీనిని కేవ‌లం బీజేపీ కోస‌మే ఆపిన‌ట్టు మిత్ర‌ప‌క్షాలు చెబుతున్నాయి.అంటే.. బీజేపీ క‌లిసి వ‌చ్చేస్తోంద‌న్న వాద‌న‌ను మిత్ర‌ప‌క్షాలు చెబుతున్నాయి. ఇంత‌లోనే కేంద్ర మంత్రి మంగ‌ళ‌వారం చేసిన వ్యాఖ్య‌లు కూడా.. బీజేపీ.. టీడీపీతో క‌లిసి న‌డించేందుకు రెడీ అయింద‌ని దాదాపు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఆక‌స్మికంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండడం గ‌మ‌నార్హం. దీనిపై టీడీపీ నేత‌లు త‌మ బంధాన్ని చెడ‌గొట్టేందుకే జగన్ లాబీయింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే తాము మద్దతివ్వలేని పరిస్థితులు వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో బీజేపీ కూడా లేదని అంటున్నారు. అయితే వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.

Satya

Recent Posts

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 minutes ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

18 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago